/rtv/media/media_files/2025/12/03/dod-dies-in-a-bomb-blasted-in-bhadradri-kothagudem-2025-12-03-14-32-25.jpg)
Dod dies in a bomb blasted in bhadradri kothagudem
భద్రాద్రి కొత్తగూడెం రెల్వేస్టేషన్లో బాంబు కలకలం రేపింది. రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్ఫాంపై గుర్తుతెలియని వ్యక్తులు నల్లని సంచుల్లో బాంబు ఏర్పాటు చేశారు. రైల్వే ట్రాక్పై ఉన్న బాంబును వీధి కుక్క కొరకడంతో భారీ శబ్దం వచ్చింది. దీంతో కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. భారీ శబ్దం రావడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. ప్రయాణికుల సమాచారం మేరకు 3వ టౌన్ పోలీసులు, రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. డాగ్స్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పేలిన బాంబు నాటు బాంబు అని పోలీసులు అనుమానిస్తున్నారు. దీని వెనుక కుట్ర ఏమైనా ఉందా అనే దానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం రైల్వే స్టేషన్లో నాటు బాంబుల కలకలం
— Telugu Scribe (@TeluguScribe) December 3, 2025
ఒక బాంబును కొరికిన వీధి కుక్క.. పేలుడు ధాటికి ఆ కుక్క మృతి
రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న చెత్త కుప్పలో నాటు బాంబులను గుర్తించిన పోలీసులు
రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా పడి ఉన్న సంచులను చెత్తకుప్పలో పడేసిన రైల్వే… pic.twitter.com/7pYpy8vDSB
Follow Us