/rtv/media/media_files/2025/11/11/jubillee-2025-11-11-18-47-22.jpg)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పోలింగ్ చివరి దశలో పలు బూత్ల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు ఇచ్చారు. పోలింగ్ పూర్తయ్యే వరకు అన్ని రాజకీయ పత్రికా సమావేశాలపై ఎన్నికల కమిషన్ నిషేధించింది. వాటిని లెక్కచేయకుండా మాగంటి సునీత ప్రెస్మీట్ పెట్టారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఫేక్ ఓట్లు, రిగ్గింగ్ చేస్తున్నారని నిరసనకు దిగిన మాగంటి సునీత
— Telugu Scribe (@TeluguScribe) November 11, 2025
కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్లతో దౌర్జన్యాలకు పాల్పడుతుంది, మా పార్టీ కార్యకర్తలను కొట్టి, తిరిగ వారి మీదనే కేసులు పెడతామని నవీన్ యాదవ్ అనుచరులు బెదిరిస్తున్నారు –మాగంటి సునీత pic.twitter.com/ZwXjxQkvTX
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారికి పోలీసులు మద్దతు తెలుపుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు నిరసనకు దిగారు. నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన పోలీసులు pic.twitter.com/WykVwuKV0f
— HEMA NIDADHANA (@Hema_Journo) November 11, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను రద్దు చేయాలని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత డిమాండ్#MagantiSunitha#JubileeHillsByElectionpic.twitter.com/1dcFQIQNLG
— Telugu360 (@Telugu360) November 11, 2025
యూసఫ్గూడ చెక్పోస్ట్ దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అధికారులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళనలకు దిగారు. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తి చేసింది. దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా రోడ్డుపై బైఠాయించారు.
Follow Us