Telangana: గురుకులాల్లో కోడింగ్‌ శిక్షణ.. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు !

తెలంగాణవ్యాప్తంగా గురుకులాల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు కోడింగ్‌పై శిక్షణ ఇవ్వనున్నారు. మంగళవారం సెక్రటరీ అలుగు వర్షిణి ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ విద్యా సంవత్సరం నుంచే 238 గురుకుల పాఠశాలల్లో దీన్ని ప్రారంభిస్తామని తెలిపారు.

New Update
TGSWREIS

TGSWREIS

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TGSWREIS) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు కోడింగ్‌పై శిక్షణ ఇవ్వనుంది. మంగళవారం సెక్రటరీ అలుగు వర్షిణి ఈ విషయాన్ని వెల్లడించారు. పదో తరగతి విద్యార్థులకు ఇందుకు మినహాయిస్తున్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచే 238 గురుకుల పాఠశాలల్లో కోడింగ్‌ కోర్సుపై శిక్షణ ఇవ్వనున్నామని స్పష్టం చేశారు. 

గతేడాది మొయినాబాద్‌ గురుకుల పాఠశాలలో మాత్రమే కోడింగ్‌పై శిక్షణ ఇచ్చామని.. ఇప్పుడు అన్ని పాఠశాలల్లో అమలు చేయనున్నామని తెలిపారు. అయితే ఈ శిక్షణ కోసం గురుకుల సంస్థ యూకేలోని లండన్‌కు చెందిన ర్యాస్ప్ బెర్రీపై పౌండేషన్ (RBF) తో ఐదేళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే విద్యార్థులకు కావాల్సిన స్కిల్స్, కరిక్యులమ్. మానిటరింగ్, టీచింగ్, యాక్షన్ ప్లాన్ వంటి వివిధ అంశాల్లో ఫౌండేషన్ నిర్వహకులు పాలు పంచుకోనున్నారు. 

Also read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఆన్‌లైన్ టూల్స్‌కు సంబంధించిన పాఠ్యాంశాలను విద్యార్థులకు బోధించేందుకు అంతా సిద్ధం చేశారు. గురుకుల సంస్థ ఈ కోడింగ్‌ శిక్షనను పైలట్‌ ప్రాజెక్ట్‌గా ప్రతి పాఠశాలలో ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా అమలు చేసింది. దీని ఫలితాలు మెరుగ్గా రావడంతో ఫౌండేషన్ ప్రతినిధులను గురుకుల అధికారులు ఒప్పించారు. అలాగే అన్ని పాఠశాలల్లో కంప్యూటింగ్ పాఠ్యాంశాలను రెగ్యులర్‌ సబ్జెక్టుగా ప్రవేశపెట్టనున్నారు. 

Also Read: బయటపడిన ఫేక్ డాక్టర్.. ఒకే నెలలో ఎంతమంది మృతి చెందారంటే?

గురుకులాల్లో కోడింగ్ శిక్షణలో భాగంగా విద్యార్థులకు 2 గంటల పాటు బోధిస్తారు. మరో రెండు గంటలు ప్రాజెక్ట్ వర్క్ కూడా చేయిస్తారు. దాదాపు 1.52 లక్షల మంది విద్యార్థులకు కంప్యూటింగ్ పాఠ్యాంశాలను ఒక సబ్జెక్టుగా నేర్పించి పరీక్ష కూడా నిర్వహిస్తారు. ఆ తర్వాత కోర్సును పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికేట్లు జారీ చేస్తారు. అయితే గురుకులాల్లో విద్యార్థులకు కోడింగ్ టెక్నాలజీని నేర్పించడం చరిత్రలో ఇదే మొదటిసారని.. ఇదొక మైలురాయిగ నిలుస్తుందని సెక్రటరీ అలుగు వర్షిణి ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే కోడింగ్‌ శిక్షణ, బోధన కోసం స్కూల్స్‌లో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్‌లను కూడా తీసుకొస్తామని చెప్పారు.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు