/rtv/media/media_files/2025/02/28/NokkRlWW4BZHaU7XVigo.jpg)
FAKE DOCTORS
మధ్యప్రదేశ్లో ఫేక్ డాక్టర్ ఘటన వెలుగులోకి వచ్చింది. నకిలీ వైద్యుడిగా ఉంటూ ఏడుగురు వ్యక్తుల మృతికి కారణమైన ఘటనలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. నిందితుడైన నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ దామోహ్ ప్రైవేటు మిషనరీ ఆసుపత్రిలో విధులు నిర్వర్తించేవాడు. ఫేక్ డాక్టర్ అని ఆసుపత్రిలో ఉండే పరికరాలను దొంగతనం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 5 నుంచి 7లక్షల విలువైన పోర్టబుల్ ఎకో మిషన్ను అతను దొంగతనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!
'Fake' Doctor kills 7 patients in Damoh, M.P
— TIMES NOW (@TimesNow) April 8, 2025
There are millions of doctors in India practicing without really having degrees, and it's not always illegal: @DrGodseRavi1
Doctor Narendra Vikramaditya Yadav (the fake doctor) operated on my father. He worked very quickly, was… pic.twitter.com/qDFp3iOkQO
ఇది కూడా చూడండి: USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..
ఆసుపత్రిలోని పరికరాలను కూడా..
వీటిని దొంగతనం చేయడానికి ఇతరుల సాయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓ మహిళా డాకర్ట్కు చెందిన ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ నంబరు అన్ని తీసుకుని ఫేక్ డాక్టర్గా ఆసుపత్రిలో చేరాడు. ఫేక్ డాక్టర్ దమోహ్ దగ్గర శస్త్రచికిత్స చేయించుకున్న ఏడుగురు రోగులు వారం వ్యవధిలో మరణించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్జాన్కెమ్ అనే ఓ ప్రసిద్ధ బ్రిటిష్ వైద్యుడి పేరు వాడుకొ దమోహ్ కార్డియాలజిస్టుగా చెలామణి అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక