/rtv/media/media_files/2025/11/16/vice-president-radhakrishnan-2025-11-16-19-02-44.jpg)
ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందు ఏర్పాటు చేశారు. గవర్నర్ తేనీటి విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ తదితరులు హాజరయ్యారు. అంతకు ముందు బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్, సీఎం.. ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్కు స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతి హోదాలో రాధాకృష్ణన్ తెలంగాణ రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి.
హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన భారత ఉప రాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ గారికి బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సాదర స్వాగతం పలికారు.
— Telangana CMO (@TelanganaCMO) November 16, 2025
హైదరాబాద్ వచ్చిన సందర్భంగా విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారు, ముఖ్యమంత్రి గారితో పాటు కేంద్ర… pic.twitter.com/uzuE1kx62o
రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ , ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉప రాష్ట్రపతి గారికి స్వాగతం పలికారు.
Follow Us