Telangana: హైదరాబాద్‌కు భారీగా పెట్టుబడులు.. రూ.450 కోట్లతో ఐటీ పార్కు

హైదరాబాద్‌లో రూ.450 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సింగపుర్‌కు చెందిన క్యాపిటల్‌ ల్యాండ్ ప్రతినిధులు ముందుకొచ్చారు. నగరంలో లక్ష చదరపు అడగుల మేర భారీ ఐటీ పార్కును నిర్మించేందుకు సీఎం బృందంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నారు.

New Update
CM Revanth Team in Singapore

CM Revanth Team in Singapore

సీఎం రేవంత్ నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ప్రస్తుతం సింగపూర్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా క్యాపిటల్‌ ల్యాండ్ ప్రతినిధులతో ఈ బృందం సమావేశమయ్యింది. హైదరాబాద్‌లో రూ.450 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. నగరంలో  లక్ష చదరపు అడగుల మేర భారీ ఐటీ పార్కును నిర్మించేందుకు సీఎం బృందంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.  

ఇదిలాఉండగా.. తెలంగాణలో రూ.3500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎస్టీ టెలీమిడియా గ్లోబల్ డేటా సెంటర్ కూడా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. రంగారెడ్డి జిల్లాలోని ముచ్చర్లు దగ్గర్లో మీర్‌ఖాన్‌పేటలో అధునాతన ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ క్యాంపస్‌ను నిర్మించేందుకు ఈ కంపెనీ కూడా ఎంవోయూ కుదుర్చుకుంది.

మరోవైపు తెలంగాణలో స్కిల్స్ డెవలప్‌మెంట్ పట్ల అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి  సింగపూర్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ముందుకొచ్చింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో కీలకమైన ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్ సమక్షంలో సింగపూర్ ఐటీఈ అధికారులు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వైఎస్ ఛాన్సలర్ వీఎల్ వీఎస్ఎస్ సుబ్బారావు ఒప్పందంపై సంతకాలు చేశారు.

సీఎం ప్రతినిధి బృందం సింగపూర్ పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ ఫూ హైయిన్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో ఉన్న అపార పెట్టుబడి అవకాశాలు, భాగస్వామ్యాలపై ఈ సమావేశంలో ఇరుపక్షాల మధ్య విస్తృత చర్చలు జరిగాయి. ముఖ్యంగా పట్టణాభివృద్ధి ప్రణాళిలు, మౌలిక సదుపాయాల కల్పన, నీటి వనరులు - నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, క్రీడలు, సెమీ కండక్టర్లు, తయారీ, పర్యావరణం, స్థిరత్వ, సాంకేతికత సహా వివిధ రంగాలలో తెలంగాణలో  పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, భాగస్వామ్యాలపై చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి.

సింగపూర్ విదేశాంగ మంత్రి వివియాన్ బాలకృష్ణన్ తోనూ సీఎం రేవంత్ టీమ్ విస్తృత చర్చలు జరిపింది. సింగపూర్ పర్యటన అనంతరం స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం పాల్గొనున్నారు. జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు ఈ సదస్సు జరగనుంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు