/rtv/media/media_files/2025/03/06/MT1NU8upP03kG4LRfm2d.jpg)
Cabinet expansion
Cabinet expansion : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ఉత్కంఠ రేపుతున్న మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. మంత్రివర్గ విస్తరణతో పాటుగా ముఖ్య పదవుల భర్తీ పైన ఏఐసీసీ జాబితా కు రూపం ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. సామాజిక అంశాలు.. సీనియారిటీ ప్రాతిపదికన ఈ లిస్టు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కస్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో పార్టీలో మార్పులు చేర్పులు తప్పనిసరి అని అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగా రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటనకు ఢిల్లీ వెల్లనున్నారు. రేవంత్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది.
Also Read: షామా కేక్పై మళ్లీ రచ్చ.. టేస్ట్ చూడాలంటే రోహిత్ కంటే ఫిట్గా ఉండాలట!
మరోవైపు ఈ మధ్నాహ్నం సీఎం రేవంత్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డికి ఇంటికి వెళ్లటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయనకు ప్రభుత్వంలో కీలకపదవి ఇవ్వనున్నారనే ప్రచారం సాగుతోంది. ఆయనను ప్రభుత్వ సలహదారుగా నియమిస్తారని తెలుస్తోంది. ఇక అదే సమయంలో తెలంగాణలో కేబినెట్ విస్తరణ.. పదవుల ఖరారు పైన కీలక చర్చలు జరుగుతున్నాయి. పార్టీ తో పాటు ప్రభుత్వంలో ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. కేబినెట్ లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాల భర్తీతో పాటుగా డిప్యూటీ స్పీకర్ పదవి పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చీఫ్ విప్.. కార్పోరేషన్ ఛైర్మన్ల పదవులు భర్తీ చేయనున్నారు. అందులో భాగంగా డిప్యూటీ స్పీకర్ పదవి లంబాడా వర్గానికి ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లాకు ఉప సభాపతి పదవి దక్కటం దాదాపు ఖాయమైంది.
Also Read: పోసానికి ఏపీ హైకోర్టులో నిరాశ..క్వాష్ పిటిషన్ కొట్టివేసిన ఏపీ హైకోర్టు.
రంగారెడ్డి జిల్లాకు చెందిన రెడ్డి వర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యేను చీఫ్ విప్ చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం.ఇక మైనార్టీ వర్గానికి ఒక మంత్రి పదవి దక్కనుంది. ఇందు కోసం గ్రేటర్ పరిధిలోని నాయకుడిని గుర్తించినట్లు ప్రచారం సాగుతోంది. నల్గొండ నుంచి మరొకరికి మంత్రిగా ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే, ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉండటంతో చివరి నిమిషంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉమ్మడి కరీం నగర్ జిల్లా నుంచి మరొకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆ సీనియర్ నేతను కేబినెట్ లో తీసుకుంటారని సమాచారం.
ఇది కూడా చూడండి: Railway Jobs: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!
ఇద్దరు బీసీలను కేబినెట్ లోకి తీసుకోవాలని ఏఐసీసీ సూచిస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఒకరికి ఛాన్స్ ఖాయంగా కనిపిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ నుంచి గతంలో మంత్రిగా పని చేసిన సీనియర్ నేతకు తిరిగి బెర్తు ఖాయమైనట్లు సమాచారం. ఇక, ఉమ్మడి అదిలాబాద్ నుంచి దళిత ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కనుంది. ఇద్దరు బీసీలతో పాటుగా ఇద్దరు రెడ్డి, ఒక మైనార్టీ, ఒక దళిత వర్గాలకు కొత్తగా కేబినెట్ లో అవకాశం దక్కనుంది. ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలోనూ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న సీనియర్ నేతతో పాటు మరో ఇద్దరికీ ఎమ్మె్ల్సీలు దక్కనున్నాయి. అవి ఎవరికివ్వాలి అనే అంశం పై చర్చిస్తున్నారు.అదే విధంగా నామినేటెడ్ పోస్టుల్లోనూ సామాజిక లెక్కల ఆధారంగా నిర్ణయం చేయనున్నారు. సీఎం రేవంత్ పర్యటనలో ఈ సారి ఏఐసీసీ అన్ని అంశాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
Also read: Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదంలో మరో స్పెషల్ ఐటెమ్