'మేఘా' దోపిడీకి రేవంత్ రక్ష.. ఇదే ప్రూఫ్.. కేటీఆర్ సంచలన ఆరోపణలు

అవినీతి మేఘా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. సమాచార హక్కు కింద ఆ రిపోర్ట్ ఇవ్వాలని కోరితే ఇవ్వకుండా రేవంత్ సర్కార్ తొక్కిపెడుతోందన్నారు. మేఘాతో చీకటి ఒప్పందం కారణంగానే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.

New Update
KTR MEGHA Krishnareddy

సుంకిశాలలో మేఘా సంస్థ నిర్లక్ష్యం వల్ల రిటైనింగ్‌వాల్‌ కూలి రూ. 80 కోట్ల ప్రజాధనానికి నష్టం వాటిల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ ఘటనతో హైదరాబాద్ లో పెరుగుతున్న తాగునీటి అవసరాలు తీర్చే సంకల్పానికి గండిపడిందన్నారు. అయితే ఈ ఘటనపై విజిలెన్స్ నివేదికను సమాచార హక్కు చట్టం కింద ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. ప్రజా ధనానికి నష్టం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన నివేదికను ఇలా తొక్కిపెట్టడం దారుణమన్నారు. నిర్మాణ లోపం బయట పడుతుందనే భయంతోనే కమిటీ నివేదికను బహిర్గతం చేయడానికి కాంగ్రెస్ సర్కారు జంకుతోందని ఆరోపించారు. ఈ సమాచారాన్ని దాచడం అంటే జరిగిన తప్పును ఒప్పుకున్నట్లేనన్నారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: ఆ ముగ్గురు మంత్రులు ఔట్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!

మేఘాను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని రిపోర్ట్..

మేఘా లాంటి తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్న నిర్మాణ సంస్థ చేసిన ఘోర తప్పిదాన్ని.. దేశ రక్షణకు సంబంధించిన సమాచారహక్కు సెక్షన్లతో ముడిపెట్టి దాచడం మరింత విడ్డూరమన్నారు. మేఘా సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని కమిటీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిందన్నారు. సీఎం రేవంత్-మేఘా కృష్ణారెడ్డికి మధ్య కుదిరిన చీకటి ఒప్పందం కారణంగానే ఈ రిపోర్ట్‌ ను ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోందని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ అని దుమ్మెత్తిపోసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారని ధ్వజమెత్తారు. 
ఇది కూడా చదవండి: BIG BREAKING: రేపటి బీఆర్ఎస్ రైతు ధర్నా వాయిదా.. కారణమిదే!

లక్షల కోట్ల ప్రజాసంపదను కొల్లగొడుతున్న ఈ కంపెనీని తన జేబు సంస్థగా మార్చుకుని ఢిల్లీ పెద్దల ధనదాహాన్ని తీర్చుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్. బ్లాక్‌లిస్టులో పెట్టాల్సిన మేఘా సంస్థకు, మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి రూ.4,350 కోట్ల కొండగల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును (Quid pro Quo) చెరిసగం పంచిపెట్టారని ఫైర్ అయ్యారు. తద్వారా మరో భారీ కుంభకోణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. ఇప్పటికైనా సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసే చర్యలను మానుకోవాలన్నారు. సుంకిశాల ఘటనపై  ప్రభుత్వం చేపట్టిన విచారణ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. మేఘాను బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సిందేనన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు