BREAKING: అఖిలపక్ష సమావేశం నుంచి BRS ఎంపీ వాకౌట్

పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై ఎంపీల అఖిలపక్ష సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ వాకౌంట్ చేశారు. వద్దిరాజు రవిచంద్ర మీటింగ్‌లో రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

New Update
BRS MP Vaddiraju Ravichandra

పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై ఎంపీల అఖిలపక్ష సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ వాకౌంట్ చేశారు. వద్దిరాజు రవిచంద్ర మీటింగ్‌లో రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వాస్తవాలు బయటకురావడంతో బీఆర్ఎస్ ఎంపీ ఇబ్బంది పడ్డారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు గోదావరి జలాలు, జనకచర్ల ప్రాజెక్ట్‌లపై తెలంగాణలోని అన్నీ పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించారు.

రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కాంగ్రెస్ ఈ వ్యవహారాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకుంటుందని, సీఎం వ్యాఖ్యలపై తనకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం మధ్యలో నుంచే వెళ్లిపోయారు. కాగా రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం అని, సాగునీటి అంశంలో రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరగనివ్వబోమని, బనకచర్లను అడ్డుకొని తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వాస్తవాలు బయటికి రావడంతో రవిచంద్రకు ఇబ్బంది కలిగి ఉంటుందని, అందుకే వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు