Bandi Sanjay :  ఎమ్మెల్సీ ఎన్నికలపై బండి సంజయ్ సంచలన కామెంట్స్

తెలంగాణలో రబ్బర్ స్టాంప్ పాలన నడుస్తోందని ఆరోపించారు కేంద్రమంత్రి బండి సంజయ్.  రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన బ్రష్టు పట్టిందన్నారు. ఢిల్లీ టెన్ జన్ పథ్ నుంచి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు.

New Update
Bandi Sanjay Vs KCR

Bandi Sanjay Vs KCR

తెలంగాణలో రబ్బర్ స్టాంప్ పాలన నడుస్తోందని ఆరోపించారు కేంద్రమంత్రి బండి సంజయ్.  రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన బ్రష్టు పట్టిందన్నారు. ఢిల్లీ టెన్ జన్ పథ్ నుంచి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ గాలికి వదిలేసిందని విమర్శించారు.  సీఎం రేవంత్ కు, మంత్రులకు అసలు పాలనపై పట్టులేదన్నారు.  కాంగ్రెస్ పాలనలో ప్రతి పనికి కమిషన్లు,  అవినీతి నడుస్తోందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

ఎమ్మెల్సీ ఎన్నికలపై కీలక కామెంట్స్

ఇక ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా బండి సంజయ్ కీలక కామెంట్స్ చేశారు.  దేశద్రోహులు, దేశభక్తుల మధ్య హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఎంఐఎం గెలుపు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ సహకరిస్తున్నాయని అన్నారు. మజ్లిస్ కంబధ హస్తల నుంచి హైదరాబాద్ ను కాపాడుతామని తెలిపారు సంజయ్.   హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని..  కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ కేసుల నుంచి కాపాడుతుందని ఆరోపించారు.  

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

Advertisment
తాజా కథనాలు