మూడు,నాలుగేళ్లలో హైదరాబాద్ మెట్రో వ్యవస్థ సిటీ మొత్తం విస్తరించేలా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ తెలిపారు. రాయదుర్గం – శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు టెండర్ ప్రక్రియ జరుగుతోందన్నారు. ఇస్నాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రో విస్తరణ, మియాపూర్ నుంచి లక్డీకపూల్ వరకు, ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్పేట వరకు, ఉప్పల్ నుంచి బీబీనగర్,ఈసీఐఎల్ వరకు మెట్రో విస్తరణకు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కొత్తూరు మీదుగా షాద్నగర్ వరకు మెట్రో విస్తరణ చేపడతామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇక జేబీఎస్ నుంచి తూంకుంట, ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు డబుల్ డెక్కర్ మెట్రో నిర్మాణం చేపడతామన్నారు. గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను మళ్లీ అసెంబ్లీలో పెడతామని ఈసారి గవర్నర్ ఆమోదించక తప్పదని మంత్రి తెలిపారు. గవర్నర్తో మనకు పనిలేదని మంత్రి కేటీఆర్ అన్నారు.
పూర్తిగా చదవండి..ప్రభుత్వంలో టీఎస్ ఆర్టీసీ విలీనం, కేబినేట్లో కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.ఇకపై ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగనున్నారు.దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది.ఈ నిర్ణయంతో 43,373 మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. దీనికి సంబంధించి విధివిధానాలు, నిబంధనలు రూపొందించేందుకు అధికారులతో సబ్కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Translate this News: