Minister KTR: గజ్వేల్‌లో ఈటల పోటీపై స్పందించిన మంత్రి కేటీఆర్.. ఇంట్రస్టింగ్ కామెంట్స్..

హుజూరాబాద్, గజ్వేల్‌ రెండు స్థానాల్లోనూ తాను పోటీ చేయబోతున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటించడంపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ‘బీజేపీకి పోటీ చేసే అభ్యర్థులు లేరేమో. ఈటల రాజేందర్ గజ్వేల్‌ లోనే కాదు.. ఇంకా 50 చోట్ల పోటీ చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆయన పోటీ చేస్తున్న రెండు చోటా మేమే గెలుస్తాం’ అని వ్యాఖ్యానించారు.

Minister KTR: గజ్వేల్‌లో ఈటల పోటీపై స్పందించిన మంత్రి కేటీఆర్.. ఇంట్రస్టింగ్ కామెంట్స్..
New Update

Minister KTR Counter to Etela Rajender: హుజూరాబాద్, గజ్వేల్‌ రెండు స్థానాల్లోనూ తాను పోటీ చేయబోతున్నట్లు బీజేపీ(BJP) ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajender) ప్రకటించడంపై మంత్రి కేటీఆర్(KTR) తనదైన శైలిలో స్పందించారు. తన తూటాల్లాంటి మాటలతో ఈటలకు కౌంటర్ ఇచ్చారు. ‘బీజేపీకి పోటీ చేసే అభ్యర్థులు లేరేమో. ఈటల రాజేందర్ గజ్వేల్‌ లోనే కాదు.. ఇంకా 50 చోట్ల పోటీ చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆయన పోటీ చేస్తున్న రెండు చోటా మేమే గెలుస్తాం’ అని వ్యాఖ్యానించారు.

మంత్రి కేటీఆర్ కామెంట్స్ యధావిధిగా..

‘ మా పార్టీ ప్రకటించిన 114 మంది అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మిగతా ఐదుగురు అభ్యర్థుల పేర్లను త్వరలోనే ప్రకటిస్తాం. కాంగ్రెస్‌కు 40 చోట్ల అభ్యర్థులే లేరు. అలాంటపుడు 70 చోట్ల గెలుస్తామని ఎలా చెబుతున్నారో అర్థం కావడం లేదు. పాత రంగారెడ్డి కలిపి 29 సీట్లు.. ఇక్కడ 25 చోట్ల అభ్యర్థులు లేరు. డబ్బులు ఇచ్చిన వారికే కాంగ్రెస్‌లో టిక్కెట్లు ఇస్తున్నారు. ఈ మధ్య కాంగ్రెస్ నేత ఒకాయన కలిశారు. కూకట్‌పల్లి సీట్ కోసం ఆయన్ను రూ. 15 కోట్లు అడిగారట. గతంలో నేను చేప్పినట్టే కర్ణాటకలో అక్రమ డబ్బు జమ అవుతోంది. అక్కడ స్క్వేర్ ఫీట్‌కు రూ. 500 వసూల్ చేస్తున్నారు. తెలంగాణకు తరలించడానికి సిద్ధంగా ఉన్న రూ. 42 కోట్లు కాంగ్రెస్ కార్పొరేటర్ ఇంట్లో దొరికింది. రూ. 8 కోట్లు ఇదివరకే కొడంగల్‌కు చేరినట్టు మాకు సమాచారం ఉంది.’

‘కాంగ్రెస్ సిద్ధాంత ప్రాతిపదికన ఎన్నికల్లో కొట్లాడటం లేదు. మేము తొమ్మిదిన్నరేళ్ళుగా చేసిన పనుల గురించి చెబుతున్నాం. ప్రోగ్రెస్ రిపోర్టు లాగా ప్రజలకు అన్నీ వివరిస్తున్నాం. మా కంటే మెరుగైన పాలనా నమూనా కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా? నీతి ఆయోగ్, ఆర్బీఐ రిపోర్టులు, అన్నీ సూచీల్లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది. ఎమ్మెల్యేను ఎన్నుకోవడానికి కాదు ఈ ఎన్నికలు జరుగుతున్నది. సార్వత్రిక ఎన్నికల కోసం జరుగుతున్నాయి. తండ్రి తన అమ్మాయిని ఎవరితో పెళ్లి చేయాలన్న దానిపై చాలా ఆలోచిస్తారు. ఓటు వేసే ముందు కూడా ప్రజలు ఆలోచించి వేయాలి.’

ఇదికూడా చదవండి: Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడి తెరంగేట్రంపై రేణు దేశాయ్ ఎమన్నారంటే..?

‘అమిత్ షా అబద్ధాలకు హద్దే లేదు. అమిత్ షా మా పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి. ప్రధాని ఎక్కడికి పోయినా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వం అని తిడుతారు. ప్రధానికి అంత అహంకారమా? రాహుల్ గాంధీ లీడర్ కాదు రీడర్. ఏం రాసిస్తే అది చదువుతారు. ఈ ఎన్నికలు తెలంగాణ గల్లీ ఆత్మగౌరవానికి.. ఢిల్లీ గుజరాత్ అహంకారానికి మధ్య పోటీ. తెలంగాణకు గుజరాత్, ఢిల్లీ అహంకారానికి మధ్య పోటీ.

కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్‌లో చేరతానంటే ఆయన ఇంటికీ రేపే వెళ్లి ఆహ్వానం పలుకుతా. బీజేపీని వాళ్ళ నాయకత్వం వాళ్ళే సీరియస్‌గా తీసుకోవడం లేదు. బీజేపీకి ఈ సారి కూడా 110 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం ఖాయం. బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుంది. సీఎం కేసీఆర్ ఈ సారి కూడా వంద స్థానాల్లో ప్రచారం చేస్తున్నారు. నేను జీహెచ్ఎంసీ, సిరిసిల్ల తో పాటు కామారెడ్డి ప్రచారం చేస్తాను.’

మేనిఫెస్టోలో రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు, పెన్షనర్ల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తాం.అట్టడుగు వర్గాలకు బీఆర్ఎస్ ఊత కర్రలా ఉంటుంది. ఆర్థిక క్రమ శిక్షణలో మేమే ముందు ఉన్నాం. ఏదీ సాధ్యమో, ఏదీ అసాధ్యమో మాకు తెలుసు. ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణలో స్వతంత్రంగా పని చేస్తుందని భావిస్తున్నా. నేను వ్యక్తిగతంగా సిరిసిల్లలో ఓటర్లకు డబ్బు మద్యం పంపిణీ చేయొద్దని నిర్ణయించా.. మిగతా వారు ఏ నిర్ణయం తీసుకుంటారో వారి ఇష్టం. కాంగ్రెస్ 2004, 2009 లలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు. మేము 95 శాతం వరకు మా మేనిఫెస్టోలోని హామీలు నిలబెట్టుకున్నాం. రాష్ట్రాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్లగలుగుతారు అనే అంశం పైనే ఎన్నికలు జరుగుతాయి.

‘మతం, కులం ప్రాతిపదికన ఓట్లు కొంత వరకే పడతాయి. బీజేపీతో మాకు పొత్తుంటే ఇన్ని మైనారిటీ స్కూళ్ళు, కాలేజీలు ఎందుకు పెడతాం. సీఎం కేసీఆర్ మోడీని తిట్టినంతగా ఏ సీఎం తిట్టలేదు. బీజేపీతో స్నేహం ఉంటే ఎందుకు తిడతాం. మేము ప్రతీకార రాజకీయాలు చేయటం లేదు. మేము ఎవరేమన్నా అతి మంచితనంతో వెళుతున్నాం. రేవంత్ అక్రమాలపై బీజేపీ ప్రభుత్వం ఐటీ, ఈడీ దాడులు ఎందుకు చేయటం లేదు. మా మీదనే ఎందుకు దాడులు జరుగుతున్నాయి. ఓటుకు నోటు కేసును ఓపెన్ చేయండి. ఎవరు వద్దన్నారు. ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించేది ప్రజలే. అధికారులు కాదు. అధికారుల బదిలీలను బదిలీలలుగా గానే చూస్తాం.’

‘ప్రజలు ఓటేసేప్పుడు సీఎం ఎవరుంటారు అని చూస్తారు. కేసీఆర్ పాలన తీరు పైనే ప్రజలు తీర్పు ఇస్తారు. మేము చేసింది చెప్పుకుంటాం. గతంలో వచ్చినట్టే మాకు 88 సీట్లు రావచ్చు. హుజురాబాద్‌‌లో కూడా మేమే గెలుస్తున్నాం. ఈటెల రాజేందర్ గజ్వెల్ లోనే కాదు ఇంకా 50 చోట్ల పోటీ చేసినా అభ్యంతరం లేదు. బీజేపీకి పోటీ చేసే అభ్యర్థులు లేరేమో. షర్మిల 119 సీట్లలో పోటీ చేసినా అభ్యంతరం లేదు. రాహుల్ గాంధీ, మోడీ లు కూడా ఇక్కడకొచ్చి పోటీ చేసినా అభ్యంతరం లేదు. త్వరలో చాలా మంది ప్రముఖులు బీఆర్ఎస్‌లో చేరతారు. కాంగ్రెస్‌లో టికెట్ల ప్రకటన తర్వాత గాంధీ భవన్‌లో తన్నుకుంటారు. కాంగ్రెస్ అంటే గందరగోళం, ఆగమాగం. కాంగ్రెస్‌లో అప్పుడే సీఎం పదవికి ఇద్దరు నేతల మధ్య అంగీకారం కుదిరినట్టు నాకు సమాచారం ఉంది. గతంలో ఉత్తమ్ మాట్లాడినట్లే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.’

ఇదికూడా చదవండి: భారత్-పాక్ మ్యాచ్ క్రేజ్…ఆసుపత్రులలో బెడ్స్ బుకింగ్

#etela-rajender #gajwel-contest #telangana-news #bjp-mla-etela-rajender #minister-ktr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe