Telangana: చిన్నారిపై హత్యాచారం కేసు.. దోషికి మరణశిక్ష

2018లో హైదరాబాద్‌లోని నార్సింగిలో నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషికి హైకోర్టు మరణశిక్ష విధించింది. గతంలో నిందితుడికి రంగారెడ్డి కోర్టు ఉరిశిక్ష విధించగా అతడు హైకోర్టును ఆశ్రయించాడు. తాజాగా హైకోర్టు కింది కోర్టు తీర్పును సమర్థించింది.

New Update
Telangana: చిన్నారిపై హత్యాచారం కేసు.. దోషికి మరణశిక్ష

2018లో హైదరాబాద్‌లోని నార్సింగిలో నాలుగున్నరేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో దోషికి హైకోర్టు మరణశిక్ష విధించింది. ఆ చిన్నారిపై సెంట్రింగ్ కార్మికుడు దినేశ్ కుమార్ అనే వ్యక్తి ఈ కిరాతకానికి ఒడిగట్టాడు. ఈ కేసులో 2021లో నిందితుడికి రంగారెడ్డి కోర్టు ఉరిశిక్ష విధించింది. దీంతో ఈ తీర్పుపై అతడు హైకోర్టులో సవాల్ చేశాడు. అతడి పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. కింది కోర్టు తీర్పును సమర్థించింది.

Also Read: ఆ డిమాండ్‌కు నో చెప్పిన రేవంత్.. గద్వాల ఎమ్మెల్యే యూట‌ర్న్‌కు కారణమిదే?

Advertisment
తాజా కథనాలు