Telangana: ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో త్వరలో ఎంసెట్‌, నీట్‌ కోచింగ్‌..!

ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎంసెట్, నీట్, జేఈఈ, సీఏ వంటి వాటికి శిక్షణ ఇప్పించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. అలాగే ఒకేషనల్‌ కోర్సులు చదువుతున్న వారి కోసం నైపుణ్యాలు పెంచి ప్రత్యేక జాబ్‌మేళాలు నిర్వహించనున్నారు.

Telangana: ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో త్వరలో ఎంసెట్‌, నీట్‌ కోచింగ్‌..!
New Update

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎంసెట్, నీట్ కోచింగ్ ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఒకేషనల్‌ కోర్సులు చదువుతున్న వారి కోసం ప్రత్యేక జాబ్‌మేళాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేట్ కార్పొరేట్‌ కాలేజీల్లో చదివే విద్యార్థులతో పోటీ పడేలా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులను తీర్చిదిద్దేలా శిక్షణలు ఇప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 400 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎంసెట్, నీట్, జేఈఈ, సీఏ వంటి కోర్సులు కోచింగ్ నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

శిక్షణలో భాగంగా ప్రతిరోజూ 50 నిమిషాల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. ఇప్పటికే జూనియర్ లెక్చరర్లకు నిపుణులతో ప్రత్యేక ట్రైనింగ్ కూడా ఇప్పించారు. అలాగే కోచింగ్‌లో ప్రతివారం విద్యార్థులు పరీక్షలు కూడా ఉంటాయి. విద్యార్థులకు ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ జూనియర్ ఒకేషనల్ కళాశాలల్లో చదువుతున్న వారికి నైపుణ్యాలు పెంచి, వారికి ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. అయితే రాష్ట్రంలో దాదాపు 187 కాలేజీల్లో ఒకేషనల్ కోర్సులు ఉన్నాయి. మొత్తం 22 రకాల కోర్సులు నిర్వహిస్తున్నారు. ఇందులో కంప్యూటర్ సైన్స్‌, మెకానికల్, సివిల్ లాంటి ఏడు ఇంజినీరింగ్ కోర్సులు కూడా ఉన్నాయి. ఆయా రంగాల కంపెనీలతో, సంస్థలతో అవగాహన ఒప్పందం చేసుకొని కళాశాలలతో అనుసంధానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక కోర్సు ముగిశాక ఓ ఏడాది పాటు ఆయా కంపెనీలు, సంస్థలు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తాయి. ఆ తర్వాత జాబ్‌ మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి.

Also read: కొత్త పీసీసీ చీఫ్‌కు త్వరలో అనేక సవాళ్లు.. బ్యాలెన్స్‌ చేయగలరా ?

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలను అమలు చేయడం కోసం ప్రత్యేక అకడమిక్ గైడెన్స్, ట్రైనింగ్ అండ్‌ ప్లేస్‌మెంట్‌ సెల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సెల్‌లో పనిచేయడం కోసం ముగ్గురు జూ.లెక్చరర్లను డిప్యూటేషన్‌పై నియమించనున్నారు. మరో ముగ్గురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా నియమిస్తారు. రెగ్యులర్‌గా అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించడం, దాన్ని అమలు చేయడం, ఆడిట్‌ను నిర్వహించడం వంటి వాటిపై దృష్టి పెట్టనున్నారు. అంతేకాదు ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించి కోచింగ్‌ తరగతులు ఎలా కొనసాగుతున్నాయనే విషయాన్ని కూడా ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. కొత్త కోర్సులు కూడా ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే రాష్ట్రంలో అన్ని కళాశాలల్లో బయో మెట్రిక్ హాజరు కూడా అమలుచేయనున్నారు.

#eapcet #telugu-news #telangana #neet
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి