Telangana: ట్యాంక్‌బండ్‌పై దశాబ్ది ఉత్సవ సంబురాలు..

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ట్యాంక్‌బ్యాండ్‌పై సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి కళాకారులు తరలివచ్చారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని చాటిచెప్పేలా 17 రకాల కళలను ప్రదర్శించారు.

Telangana: ట్యాంక్‌బండ్‌పై దశాబ్ది ఉత్సవ సంబురాలు..
New Update

Telangana Formation Day Celebrations at Tank Bund: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ట్యాంక్‌బ్యాండ్‌పై సందడి వాతావరణం నెలకొంది. ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ (Governor CP Radhakrishnan) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గవర్నర్‌తో కలిసి సీఎం రేవంత్, మంత్రులు, సీఎస్ శాంతి కుమారి తదితరులు ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి కళాకారులు తరలివచ్చారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని చాటిచెప్పేలా 17 రకాల కళలను ప్రదర్శించారు. మొత్తం ఐదు వేల మంది ట్రైనీ పోలీసులతో ఫ్లాగ్‌ వాక్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలు చూసేందుకు నగర ప్రజలు భారీగా తరలివచ్చారు. అయితే వేడుకలు ప్రారంభమైన కాసేపటికి భారీ వర్షం కురిసింది. అయినప్పటికీ వర్షంలోనే వేడుకలు కొనసాగిస్తున్నారు.

Also Read: ఏపీలో అధికారం వాళ్లేదే.. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వే

#telugu-news #telangana-formation-day #telangana-news #cm-revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe