IT Raids in Hyderabad: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) అనుచరుడు ప్రదీప్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు(IT Raids) ముగిశాయి. మూడు రోజులు జరిపిన తినిఖీల్లో అధికారులు రూ. 7.50 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మహేశ్వరం ఎన్నికల కోసమే ఈ డబ్బును ఏర్పాటు చేసినట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు. ప్రదీప్ రెడ్డితో పాటు.. రెడ్డి ల్యాబ్ డైరెక్టర్ కోట్ల నరేందర్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించగా.. ఆయన ఇంట్లో రూ. 7.50 కోట్లు నగదు పట్టుబడింది. దీంతో ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది మొదలు.. ఐటీ అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అంతకు ముందు మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్, బడంగ్పేట్ మేయర్ పారిజాత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తోడల్లుడు గిరిధర్రెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ నాయకురాలు సబిత టార్గెట్గా ఐటీ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే, పక్కా సమాచారంతోనే ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
పూర్తిగా చదవండి..Hyderabad: ముగిసిన ఐటీ సోదాలు.. మంత్రి సబిత అనుచరుడి ఇంట్లో ‘కోట్ల’ కట్టలు..
మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరుడు ప్రదీప్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. రెడ్డి ల్యాబ్ డైరెక్టర్ కోట్ల నరేందర్ రెడ్డి ఇంట్లో జరిపిన సోదాల్లో రూ. 7.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఎన్నికల కోసమే వీటిని ఏర్పాటు చేసినట్లు గుర్తించారు అధికారులు.
Translate this News: