Telangana Elections 2023: హైదరాబాద్లోని హయత్నగర్లో అర్థరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎల్బీనగర్(LB Nagar) కాంగ్రెస్(Congress) అభ్యర్థి మధుయాష్కి గౌడ్ అతిథి గృహంపై అర్థరాత్రి వేళ పోలీసులు దాడులు చేశారు. గెస్ట్ హౌస్లో సోదాలు నిర్వహించారు. ఇళ్లంతా గాలించారు. పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా, సోదాల్లో భాగంగా రూ. 5.5 లక్షల నగదును గుర్తించారు పోలీసులు. ఈ డబ్బులకు లెక్కలు చూపాలని మధుయాష్కిని కోరారు పోలీసులు. డబ్బును సీజ్ చేశారు.
పూర్తిగా చదవండి..Hyderabad: హయత్నగర్లో అర్థరాత్రి ఉద్రిక్తత.. మధుయాష్కి గౌడ్ ఇంట్లో పోలీసుల తనిఖీలు..
హయత్నగర్లో అర్థరాత్రి అలజడి రేగింది. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి గెస్ట్ హౌస్లో తనిఖీలు చేశారు పోలీసులు. సోదాల్లో రూ. 5.5 లక్షల నగదును గుర్తించి సీజ్ చేశారు. లెక్కలు చెప్పాలని మధుయాష్కిని కోరారు. ఇది ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పనే అని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
Translate this News: