Elon Musk- PM Modi: ఎలన్ మస్క్‌కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ.. ఎందుకంటే?

స్పేస్ ఎక్స్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌కు ప్రధాని శుక్రవారం ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ పోస్ట్ చేశారు. టెస్లా ఇండియాలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనతో మోదీ ఫోన్ సంభాషణ ఆకర్షణగా నిలిచింది.

New Update
PM speaks to Elon Musk

Elon Musk- PM Modi: టెస్లా(Tesla), స్పేస్‌ఎక్స్ సీఈఓ(Spacex CEO) ఎలాన్ మస్క్‌లతో శుక్రవారం ప్రధాని మోదీ ఫోన్ మాట్లాడారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ పోస్ట్ చేశారు. టెక్నాలజీతో సహా వివిధ రంగాలలో సహకారం గురించి మస్క్‌తో ఆయన మాట్లాడినట్లు తెలిపారు. ఇండియాలో టెస్లా కంపెనీ పెట్టుబడులు పెట్లేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఆ విషయమై మోదీ మస్క్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. సాంకేతికత, ఆవిష్కరణ రంగాలలో భారతదేశం, అమెరికా మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం గురించి సంభాషించారు. టెస్లా భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లోకి తీసుకురావాలని చూస్తున్న క్రమంలో ఈ ఫోన్ కాల్ ప్రాధాన్యత సంతరించుకుంది. 

Also Read: అల్లుడితో పారిపోయిన అత్తకి గరుడ పురాణంలో ఎలాంటి శిక్ష ఉంటుంది?

Also read: Maoist: ఛత్తీస్‌గడ్‌లో 22 మంది మావోయిస్ట్ అగ్రనేతలు సరెండర్

Also read: Lady Don: హాట్ టాపిక్‌గా లేడీ డాన్ జిక్రా.. ఏకంగా ఢిల్లీ సీఎం వార్నింగ్

Also Read: చిరు ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్.. 8kలో 'స్టాలిన్' గ్రాండ్ రీ-రిలీజ్‌..!

ఇండియాలోకి టెస్లా ఎంట్రీ..

ఈ ఏడాది ఫిబ్రవరిలో 2 రోజుల అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ వాషింగ్ట్ డీసీలో ఎలోన్ మస్క్‌ను కలిశారు. స్పేస్‌ఎక్స్ సీఈఓతో పాటు ఆయన ముగ్గురు పిల్లలు ఎక్స్, స్ట్రైడర్, అజూర్ కూడా ఉన్నారు. ఈ సమావేశంలో ఎలోన్ మస్క్ ప్రధాని మోదీకి స్టార్‌షిప్ షడ్భుజ హీట్‌షీల్డ్ టైల్‌ను బహుమతిగా ఇచ్చారు. టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి రెడీ అవుతున్న వేళ ప్రధాని ఎలోన్ మస్క్‌తో ఫోన్‌లో మాట్లాడటం గమనార్హం. ఈ సంవత్సరం చివర్లో ఢిల్లీ, బెంగుళూర్, ముంబై నగరాల్లో టెస్లా ఎలక్ట్రానిక్ వాహనాల సేల్స్ ప్రారంభించాలని చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక చెబుతుంది. ఈక్రమంలో ఇండియాలో షోరూమ్‌లు ప్రారంభించి టెస్లా కార్లు అమ్మాకాలు త్వరలోనే జరగనున్నాయి.

#Spacex CEO #tesla #Elon Musk- PM Modi
Advertisment
Advertisment
తాజా కథనాలు