/rtv/media/media_files/2025/04/18/J98IYulOPfzuS0GOn2Le.jpg)
Elon Musk- PM Modi: టెస్లా(Tesla), స్పేస్ఎక్స్ సీఈఓ(Spacex CEO) ఎలాన్ మస్క్లతో శుక్రవారం ప్రధాని మోదీ ఫోన్ మాట్లాడారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ పోస్ట్ చేశారు. టెక్నాలజీతో సహా వివిధ రంగాలలో సహకారం గురించి మస్క్తో ఆయన మాట్లాడినట్లు తెలిపారు. ఇండియాలో టెస్లా కంపెనీ పెట్టుబడులు పెట్లేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఆ విషయమై మోదీ మస్క్కు ఫోన్ చేసి మాట్లాడారు. సాంకేతికత, ఆవిష్కరణ రంగాలలో భారతదేశం, అమెరికా మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం గురించి సంభాషించారు. టెస్లా భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తున్న క్రమంలో ఈ ఫోన్ కాల్ ప్రాధాన్యత సంతరించుకుంది.
Also read: Maoist: ఛత్తీస్గడ్లో 22 మంది మావోయిస్ట్ అగ్రనేతలు సరెండర్
Spoke to @elonmusk and talked about various issues, including the topics we covered during our meeting in Washington DC earlier this year. We discussed the immense potential for collaboration in the areas of technology and innovation. India remains committed to advancing our…
— Narendra Modi (@narendramodi) April 18, 2025
Also read: Lady Don: హాట్ టాపిక్గా లేడీ డాన్ జిక్రా.. ఏకంగా ఢిల్లీ సీఎం వార్నింగ్
Also Read: చిరు ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్.. 8kలో 'స్టాలిన్' గ్రాండ్ రీ-రిలీజ్..!
ఇండియాలోకి టెస్లా ఎంట్రీ..
ఈ ఏడాది ఫిబ్రవరిలో 2 రోజుల అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ వాషింగ్ట్ డీసీలో ఎలోన్ మస్క్ను కలిశారు. స్పేస్ఎక్స్ సీఈఓతో పాటు ఆయన ముగ్గురు పిల్లలు ఎక్స్, స్ట్రైడర్, అజూర్ కూడా ఉన్నారు. ఈ సమావేశంలో ఎలోన్ మస్క్ ప్రధాని మోదీకి స్టార్షిప్ షడ్భుజ హీట్షీల్డ్ టైల్ను బహుమతిగా ఇచ్చారు. టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి రెడీ అవుతున్న వేళ ప్రధాని ఎలోన్ మస్క్తో ఫోన్లో మాట్లాడటం గమనార్హం. ఈ సంవత్సరం చివర్లో ఢిల్లీ, బెంగుళూర్, ముంబై నగరాల్లో టెస్లా ఎలక్ట్రానిక్ వాహనాల సేల్స్ ప్రారంభించాలని చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్బెర్గ్ నివేదిక చెబుతుంది. ఈక్రమంలో ఇండియాలో షోరూమ్లు ప్రారంభించి టెస్లా కార్లు అమ్మాకాలు త్వరలోనే జరగనున్నాయి.