ప్రపంచకప్ అయిపోయి చాలా రోజులు అవుతున్నా ఆ బాధ మాత్రం ఇంకా తీరడం లేదు. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు అయితే దాన్ని అస్సలు మర్చిపోలేకపోతున్నారు. ఇన్నాళ్ళు అసలు బయటకు కూడా కనిపించకుండా బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ గురించి రోహిత్ శర్మ తొలిసారిగా స్పందించాడు. ఫైనల్ మ్యాచ్లో పరాజయం తర్వాత తాను ఎదుర్కొన్న సంఘర్షణనను బయటపెట్టాడు. కోట్లాది మంది మనసులను గాయం చేసిన ఫైనల్ మ్యాచ్ మీద ఇప్పుడు నోరు విప్పి మాట్లాడాడు హిట్ మ్యాన్. ఆ ఓటమి నుంచి కోలుకుని ముందుకెళ్లడం చాలా కష్టమైందని.. ఫైనల్ మ్యాచ్ తర్వాత తాను ఎదుర్కొన్న సంఘర్షణ మామూలుది కాదని అంటున్నాడు. ఆ సమయంలో మొత్తం భారతజట్టుకు మద్దతుగా నిలిచిన అభిమానులకు రోహిత్ శర్మ కృతజ్ఞతలు తెలియజేశాడు.
పూర్తిగా చదవండి..Rohith Sarma:చాలా రోజులు కోలుకోలేకపోయా..వరల్డ్ కప్ తర్వాత తొలిసారి స్పందించిన రోహిత్
ప్రపంచకప్ ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు సీనియర్ క్రికెటర్లు. ఆ భాద నుంచి బయటకు వచ్చి నార్మల్ అవుతున్నారు. ఫైనల్ మ్యాచ్ గురించి తొలిసారి టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన మనోభావాలను, సంఘర్షణను బయట పెట్టారు.
Translate this News: