/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/photo-jpg.webp)
వాళ్ళిద్దరూ టీచర్, స్టూడెంట్. కర్ణాటకలోని మురుగమిల్ల హైస్కూల్ ప్రిన్సిపల్ ఒకరు అయితే అందులో పదవ తరగతి చదివే కుర్రాడు ఒకరు. వెళ్ళింది ఎడ్యుకేషనల్ టూర్కు. కానీ అక్కడ చేసింది మాత్రం రొమాంటిక్ ఫోటో షూట్. మన దేశంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం టీచర్ది. వాళ్ళకు ఎనలేని గౌరవం ఇస్తాం. అలాగే టీచర్లు కూడా స్టూడెంట్స్ను తమ పిల్లలుగా భావిస్తారు. అయితే కొంతమంది టీచర్లు ఉంటారు. వీరు స్టూడెంట్స్తో అసభ్యంగా ప్రవర్తిస్తారు. అది వేరే కేస్. కానీ కర్ణాటకలో జరిగింది మాత్రం వేరే లెవల్. టీచర్కు, స్టూడెంట్కు మధ్య విడదీయలేని అనుబంధం ఉంటుంది. ఫైవరెట్ టీచర్, పేవరెట్ స్టూడెంట్ ఇలా ఉంటాయి. కానీ అదంతా చాలా మర్యాదగా, సభ్యతతో కూడుకుని ఉంటుంది. కానీ ఇక్కడ టీచర్, స్టూడెంట్లు ఆ హద్దులను దాటేశారు. మర్యాదను పక్కన పెట్టేశారు.
Also Read:మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో ట్విస్ట్ లు
అసలేంజరిగిందంటే...మురుగమిల్లి హైస్కూల్ ప్రిన్సిపల్, అదే స్కూల్లో చదువుతన్న పదవ తరగతి పిల్లాడిని ఎడ్యుకేషనల్ టూర్ అని చెప్పి బయటకు తీసుకెళ్ళారు. అసలు అలా ఒక్క స్టూడెంట్ను తీసుకెళ్ళడమే పెద్ద వింతైన విషయం. తీరా వెళ్ళాక వాళ్ళు చేసిన పని మరీ విడ్డూరంగా అనిపించింది. టూర్కు వెళ్ళాక వాళ్ళిద్దరూ ఒక ఫోటో షూట్ చేసుకున్నారు. అందులో కుర్రాడు టీచర్ ను ఎత్తుకోవడం, ఒకరిని ఒకరు ముద్దు పెట్టుకోవడం లాంటి ఫోటోలు ఉన్నాయి. దానికి వాళ్ళాద్దరూ వేసుకున్న బట్టలు కూడా అనుమానానికి తావు తీస్తున్నాయి. ఇద్దరూ కుర్తా, చీరల్లో సంప్రదాయ బట్టల్లో ఉన్నారు. దీంతో వాళ్ళిద్దరూ ఏమైనా పెళ్ళి చేసుకున్నారా అనే అనుమానం కూడా కలుగుతోంది.
Where are we heading as a society ?
Pictures and videos from a romantic photoshoot of a government school teacher with a Class 10 student in Karnataka's Murugamalla Chikkaballapur district, went viral, following which the student's parents filed complaint with the Block… pic.twitter.com/WviIHtOP3J
— Amit Singh Rajawat (@satya_AmitSingh) December 28, 2023
ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు ఆ ఫోటోలు బయటకు వచ్చాయి. అవి కాస్తా తెగ వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు కుర్రాడి తల్లిదండ్రుల వరకూ చేరాయి కూడా. దీంతో వారు ఫైర్ అయిపోయారు. తమ పిల్లాడిని ఇలా చేయడం ఏంటంటూ పేరెంట్స్ నిలదీస్తున్నారు. ఆ లేడీ ప్రిన్సిపాల్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమెను వెంటనే డిస్మిస్ చేయాలని..తమ కుమారుడిని కలవకుండా చర్యలు తీసుకోవాలని అడుగుతున్నారు.
అయితే ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు మాత్రం ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఆ టీచర్ మీద మండిపడుతున్నారు. మన సమాజం ఎటెళ్ళిపోతోంది అంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు.