Chandrababu : వైసీపీ గెలిచే పరిస్థితి లేదు.. టీడీపీ శ్రేణులకు చంద్రబాబు భరోసా

AP: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం మాడి మసై పోతుందని అన్నారు చంద్రబాబు. ఎండల బాదుడు కంటే వైసీపీ బాదుడే ఎక్కువ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైసీపీ గెలిచే పరిస్థితి లేదని పేర్కొన్నారు. అహంకార ప్రభుత్వం కూలిపోవాలని అన్నారు.

Chandrababu: ఏపీ దిక్కులేని రాష్ట్రంగా మారింది... సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్
New Update

TDP Chief Chandrababu : సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజాగళం సభలో పాల్గొన్నారు టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu). ఈ సభలో వైసీపీ(YCP) పై విమర్శల దాడికి దిగారు. ఎండల బాదుడు కంటే వైసీపీ బాదుడే ఎక్కువ అని ఎద్దేవా చేశారు. రాజకీయ వేడి ముందు వేసవి వేడి కొట్టుకుపోతుందని అన్నారు.

ALSO READ: కడప ఎంపీ రేసులో వివేకా హత్య నిందితుడు

మే 13న వైసీపీ మాడి మసై పోతుందని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ గెలిచే పరిస్థితి లేదని పేర్కొన్నారు. అహంకార ప్రభుత్వం కూలిపోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేజీఎఫ్‌-1, కేజీఎఫ్‌-2 చూడాలంటే కోలార్‌ పోవాలి.. కేజీఎఫ్‌-3 చూడాలంటే సర్వేపల్లి(Sarvepalli) కి రావాలి అని అన్నారు. కేజీఎఫ్‌ అంటే కాకాని గోవర్ధన్‌ ఫీల్డ్‌ అని చురకలు అంటించారు. కేజీఎఫ్‌ సృష్టించిన కాకాణిని అందులోనే పాతిపెడతారని అన్నారు. కాకాణి దోచిన వనరులే రాజకీయ సమాధి చేస్తాయని హెచ్చరించారు.

#ycp #cm-jagan #tdp-chief-chandrababu #tdp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe