Chandrababu : వైసీపీ గెలిచే పరిస్థితి లేదు.. టీడీపీ శ్రేణులకు చంద్రబాబు భరోసా

AP: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం మాడి మసై పోతుందని అన్నారు చంద్రబాబు. ఎండల బాదుడు కంటే వైసీపీ బాదుడే ఎక్కువ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైసీపీ గెలిచే పరిస్థితి లేదని పేర్కొన్నారు. అహంకార ప్రభుత్వం కూలిపోవాలని అన్నారు.

New Update
Chandrababu: ఏపీ దిక్కులేని రాష్ట్రంగా మారింది... సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్

TDP Chief Chandrababu : సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజాగళం సభలో పాల్గొన్నారు టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu). ఈ సభలో వైసీపీ(YCP) పై విమర్శల దాడికి దిగారు. ఎండల బాదుడు కంటే వైసీపీ బాదుడే ఎక్కువ అని ఎద్దేవా చేశారు. రాజకీయ వేడి ముందు వేసవి వేడి కొట్టుకుపోతుందని అన్నారు.

ALSO READ: కడప ఎంపీ రేసులో వివేకా హత్య నిందితుడు

మే 13న వైసీపీ మాడి మసై పోతుందని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ గెలిచే పరిస్థితి లేదని పేర్కొన్నారు. అహంకార ప్రభుత్వం కూలిపోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేజీఎఫ్‌-1, కేజీఎఫ్‌-2 చూడాలంటే కోలార్‌ పోవాలి.. కేజీఎఫ్‌-3 చూడాలంటే సర్వేపల్లి(Sarvepalli) కి రావాలి అని అన్నారు. కేజీఎఫ్‌ అంటే కాకాని గోవర్ధన్‌ ఫీల్డ్‌ అని చురకలు అంటించారు. కేజీఎఫ్‌ సృష్టించిన కాకాణిని అందులోనే పాతిపెడతారని అన్నారు. కాకాణి దోచిన వనరులే రాజకీయ సమాధి చేస్తాయని హెచ్చరించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు