పాయకరావుపేటలో సీఎం జగన్ స్పీచ్-LIVE
పాయకరావు పేటలో సీఎం జగన్ ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
పాయకరావు పేటలో సీఎం జగన్ ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
జగన్ పై నిన్న జరిగిన దాడి నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో 'రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావ్? ఇంకెక్కడి నుంచి వస్తా తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా! కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్!'.. అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
వైఎస్ఆర్ జిల్లాలో లింగాలలో ఏపీసీసీ చీఫ్ షర్మిల పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అవినాష్ రెడ్డికి ఓడిపోతాననే భయం పట్టుకుందని.. అందుకే నన్ను అడ్డుకుంటున్నారని షర్మిల విమర్శించారు.
జగన్ అంటేనే మోసం, దగ అని టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు అన్నారు. వైసీపీని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. వైసీపీలో గెలిచే ఎమ్మెల్యేల సంఖ్య సింగిల్ డిజిట్ మాత్రమే ఉందని తెలిపారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ అధికారులు వైసీపీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల వేళ వైసీపీకి షాక్ ఇచ్చారు కర్నూలు జిల్లా మహిళానేత కప్పట్రాళ్ల బొజ్జమ్మ. ఈ రోజు భర్తతో కలిసి ఆమె టీడీపీకి చేరనున్నారు. దేవనకొండ, ఆస్పరి మండలాల్లో వీరికి మంచి పట్టు ఉంది.
ఏపీలో పెన్షన్ల అంశం చర్చనీయాంశవుతోంది. పెన్షన్స్ ఇవ్వొద్దని ఈసీకి చంద్రబాబు అండ్ కో ఫిర్యాదు చేసింది నిజం కాదా ? అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పేదల ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన ఎప్పుడైనా చంద్రబాబుకు వచ్చిందా అంటూ ప్రశ్నించారు.
నరసాపురం పార్లమెంటు స్థానానికి తప్పనిసరిగా పోటీ చేస్తానని ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. కూటమి నుంచి మరో మూడు రోజుల్లో ఈ మేరకు ప్రకటన వస్తుందన్నారు. అసెంబ్లీకి తాను పోటీ చేయనని ప్రకటించారు.
నర్సరావుపేట పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చిలకలూరిపేటలో బీసీ మంత్రిని మార్చి ఓసీ అభ్యర్థి ఎలా పెట్టారంటూ ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలలో చాలా మందిపై వ్యతిరేకత ఉందన్న శ్రీకృష్ణదేవరాయలు పూర్తి ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇటీవల వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి.. రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తాజాగా తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో 'సిద్ధం!!' అని ట్వీట్ చేశారు. దీంతో ఆయన మళ్లీ వైసీపీలో చేరతారనే ప్రచారం మొదలైంది.