BREAKING: కాంగ్రెస్లో చేరిన బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు
బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు షర్మిల.
బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు షర్మిల.
వరద పీడిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించాలన్నారు APCC చీఫ్ వైఎస్ షర్మిల. రైతులను ఆదుకునే కార్యాచరణ అమలులోకి తీసుకురావాలన్నారు. బీహార్ రాష్ట్రానికి వరద సహాయం కింద వేల కోట్లు ఇచ్చిన బీజేపీ.. ఏపీకి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
AP: జగన్ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టడంపై షర్మిల విమర్శలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనం అని అన్నారు. ఇంతకుమించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడ కనపడవు, వినపడవు అని విమర్శించారు.
AP: జగన్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. మీరు చేసిన ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు మద్దతు ప్రకటించాలని ప్రశ్నించారు. 5 ఏళ్లు బీజేపితో అక్రమ సంబంధం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి వినూత్నంగా నిరసన చేశారు. నందమూరు గ్రామంలో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని నడుంలోతు నీళ్లలో దిగి ఆందోళనకు దిగారు.
బీజేపీ మన రాష్ట్రంపై చిన్న చూపు చూస్తోందన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. NDRF బలగాలను పూర్తి స్థాయిలో పంపలేదన్నారు. వినుకొండ వ్యక్తిగత హత్యను పొలిటికల్ మర్డర్ అని జగన్ కలరింగ్ ఇస్తున్నారన్నారు. అసెంబ్లీలో ఉండాల్సిన జగన్ ఢిల్లీ వెళ్ళడం ఏమిటని ప్రశ్నించారు.
AP: వినుకొండ హత్య ఘటనపై షర్మిల స్పందిచారు. ఇలాంటి ఘటన జరగడం దారుణమని అన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది రాజకీయ హత్య అయితే, కూటమి సర్కారుకు ఇదే హెచ్చరికని అన్నారు. ఇలాంటి దాడులు మీకు, రాష్ట్రానికి మంచిది కాదన్నారు.
ఏపీలో వైసీపీ నేతల తీరు పచ్చ కామర్లోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందనే సామెతలా ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. సాక్షి పత్రికలో తల్లికి వందనం కథనంపై ప్రశ్నించినందుకు కాంగ్రెస్ ను తోక పార్టీ అని కామెంట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని APCC చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని బీజేపీ పార్టీలేనన్నారు. బీజేపీ అంటే బాబు, పవన్, జగన్ అని అభివర్ణించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.