YS Sharmila: జగన్ ఇక అధికారంలోకి రాడు.. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీపై స్పందించాలి: షర్మిల
జగన్ మళ్లీ ఇక అధికారంలోకి రాడని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి ఎందుకు రావాలి? మళ్లీ రూ.10 లక్షల కోట్లు అప్పుచేయడానికి అధికారంలోకి రావాలా? అని విమర్శించారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంపై కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు.