ఏపీలో విషాదం.. జలపాతంలో ముగ్గురు వైద్య విద్యార్థులు గల్లంతు
ఏపీలోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి సమీపంలో జలతరంగిణి జలపాతంలో ప్రమాదం జరిగింది. జలపాతాన్ని చూసేందుకు వచ్చిన 14 మంది వైద్య విద్యార్థుల్లో అయిదుగురు నీటిలో కొట్టుకపోయారు. స్థానికులు ఇద్దరిని కాపాడగా మరో ముగ్గురు గల్లంతయ్యారు.