కళ్లు తిరిగి పడిపోయిన విశాల్ | Vishal fainted in an event | reason | RTV
తమిళనాడులోని విల్లుపురంలో జరిగిన ఓ ఈవెంట్ లో హీరో విశాల్ సృహ తప్పి పడిపోవడంపై ఆయన మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. మధ్యాహ్నం ఆహారం తీసుకోకపోవడం వలనే ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించినట్లు చెప్పారు.
విశాల్ హీరోగా తెరకెక్కిన మదగజరాజ సినిమాను ముగ్గురు స్టార్ హీరోయిన్లు వదులుకున్నారు. శ్రుతి హాసన్తో పాటుగా హన్సిక మోత్వాని, కార్తీక నాయర్, కార్తీక నాయర్, తాప్సీ పన్నులు ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. ఫైనల్ గా వరలక్ష్మి శరత్కుమార్, అంజలిలను ఎంపిక చేశారు.
గత 15 సంవత్సరాలుగా తాను ప్రేమలో ఉన్నానని, అతను తన చిన్ననాటి స్నేహితుడిని చెప్పుకొచ్చింది నటి అభినయ. మాకు తెలియకుండానే మేమిద్దరం ప్రేమించుకోవడం మొదలుపెట్టామని... దయచేసి తనను ఏ నటుడితోనూ లవ్ ఉందంటూ రూమర్స్ రాయొద్దని చెప్పింది.
మొన్నటి వరకూ అనారోగ్యంతో కనిపించిన విశాల్.. ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఆయన 'మదగజరాజా' మూవీ ఇటీవల రిలీజై మంచి సక్సెస్ సాధించింది. దీంతో నిన్న జరిగిన సక్సెస్ పార్టీలో అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఫుల్ ఎనర్జీతో సందడి చేశాడు. ఆ వీడియో నెట్టింట వైరలవుతోంది.
హీరో విశాల్ ఆరోగ్యం పై చెన్నై ఆస్పత్రి వైద్యులు స్పందించారు. విశాల్ ఫీవర్ తో బాధపడుతున్నారని.. చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని లెటర్ విడుదల చేశారు.
కోలీవుడ్ హీరో విశాల్.. శివ కార్తికేయన్ సినిమాలో విలన్ గా కనిపించనున్నారనే వార్తలపై క్లారిటీ ఇచ్చారు. అవన్నీ అవాస్తవాలు. అందులో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతానికి నేను విలన్ పాత్రలు చేయాలనుకోవడం లేదు. ఈ వార్తలు ఎవరు సృష్టిస్తున్నారో నాకు తెలుసని అన్నారు.
హీరో విశాల్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన తాజా చిత్రం రత్నం. 'సింగం' ఫేమ్ హరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 26 న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు మేకర్స్.