‘వందే సాధారణ్ ఎక్స్ప్రెస్’ ట్రయల్ రన్ సక్సెస్
ప్రయాణికులకు భారతీయ రైల్వే అధికారులు మరో గుడ్ న్యూస్ చెప్పారు. కొత్తగా ప్రవేశపెట్టబోతున్న 'వందే సాధారణ్ ఎక్స్ప్రెస్' ట్రయల్ రన్ సక్సెస్ అయినట్లు తెలిపారు. ఈ మేరకు ముంబై నుంచి బయలుదేరిన ఈ ట్రైన్ ఎలాంటి ఆటంకాలు లేకుండా అహ్మదాబాద్ చేరుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.