AP News: దోపిడీ దొంగల ఆట కట్టించిన తిరుపతి పోలీసులు..అభినందించిన ఎస్పీ
తిరుపతి జిల్లాలో అనేక చోట్ల దొంగతనాలతో పట్టణ, మండల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత రెండు మూడు నెలల సమయంలోనే వరుస చోరీలు చోటుచేసుకోవటంతో జిల్లా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
తిరుపతి జిల్లాలో అనేక చోట్ల దొంగతనాలతో పట్టణ, మండల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత రెండు మూడు నెలల సమయంలోనే వరుస చోరీలు చోటుచేసుకోవటంతో జిల్లా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
భవ్యశ్రీ మృతిపై చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి మాటల్లో వాస్తవాలు లేవని ఆర్టీవీతో భవ్యశ్రీ తల్లిదండ్రులు వాపోతున్నారు. ఎస్పీ ఫోరెన్సిక్ నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు భవ్యశ్రీ తల్లి పద్మ. ఎవరూ ఎన్ని చెప్పినా తన బిడ్డది హత్యేనంటూ ఆక్రోశం వెల్లగక్కారు. పోలీసులు కేసును ప్రక్క దారి పట్టిస్తున్నారని తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది. నా బిడ్డ నా వల్లె చనిపోయిందని అంటుంటే గుండె బరువెక్కి పోతుందని వాపోతోంది.
తిరుపతిలో జంట హత్యలు కలకలం రేపుతోంది. ఈ ఘటన కపిలతీర్థం సమీపంలోని ఓ ప్రైవేట్ హోటట్లో చోటుచేసుకుంది. బావ పదునైన ఆయుధంతో అన్న, చెల్లెల్లను పొడిచి హత్య చేశాడు. మృతులను మహారాష్ట్ర నాందేడ్కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.
తిరుపతి బస్టాండ్లోకిడ్నాప్ అయిన బాలుడి కేసును పోలీసులు చేధించారు. బాలుడిని నిందితుడు సుధాకర్ తీసుకెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. సుధాకర్ చిన్నారిని ఏర్పేడులోని తన అక్క ఇంటికి తీసుకెళ్లినట్లు గుర్తించారు. సీసీ పుటేజీ ద్వారా దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలుడు ఏర్పేడులో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిందితుడి నుంచి బాలుడ్ని తీసుకొని ఏర్పేడు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. దీంతో అక్కడకు చేరుకున్న బాలుడి కుటుంబ సభ్యులకు పోలీసులు చిన్నారిని అప్పగించారు.
తిరుపతిలో కిడ్నాప్కు గురైన చిన్నారి కథ సుఖాంతమైంది. బాలుడిని కిడ్నాప్ చేసిన సుధాకర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ నుంచి తీసుకువచ్చిన బాలుడిని తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. బాలుడు కిడ్నాపైన 7 గంటల్లో పోలీసులు కేసును ఛేదించారు.
తిరుమల అంటేనే ఒక్కసారిగా ఒళ్ళు జలకరించాల్సిందే. గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూస్తే శ్రీవారి భక్తులకు వణికిపోవాల్సిందే. తిరుమలలో ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. ఈమధ్య చిరుతలు, ఎలుగుబంట్లు, ప్రాణపోయిన సందర్భాలను చూశాం. తిరుమలకు వెళ్తే.. ప్రాణాలతో తిరిగి వస్తామా..!! అనే భయం శ్రీవారి భక్తులకు వస్తోంది. తాజాగా మరో ఘటనతో తిరుమలలో కలకలం రేపుతోంది.
ఏడుకొండల్లో కొలువైన శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు వస్తుంటారు. వివిధ మార్గాల్లో తిరుమల చేరుకునే భక్తులు ఆ ఏడు కొండలవారిని దర్శించుకుని పులకించిపోతారు. అయితే నడకమార్గంలో పులల సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే.
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వారసుడు భూమన అభినయ్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి బరిలో దిగుతున్నట్లు వైసిపి వర్గాల్లో టాక్ నడుస్తోంది. రిసెంట్ గా కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ సీఎం జగన్ ను కలిశారని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని గెలవాలని సీఎం జగన్ వారికి దిశ నిర్దేశం చేశారని సమాచారం.