AP: తిరుపతి జిల్లాలో చిరుత కలకలం
తిరుపతి జిల్లా చంద్రగిరి కొటాల పంచాయతీలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. జగనన్న కాలనీలో సాయంత్రం పని ముగించుకుని వస్తున్న కూలీలు చిరుతని చూసి షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి కొటాల పంచాయతీలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. జగనన్న కాలనీలో సాయంత్రం పని ముగించుకుని వస్తున్న కూలీలు చిరుతని చూసి షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ నగర్లో వాచ్మెన్ భార్య దారుణ హత్యకు గురయింది. దుండగులు ఇంట్లో చొరబడి ఆమె గొంతు కోసి హతమార్చారు. వ్యక్తిగత పనుల నిమిత్తం భర్త రామిరెడ్డి కడపకు వెళ్లినట్లు తెలుస్తోంది. అంధురాలైన కుమార్తెతో ఇంట్లో ఉన్న వాచ్మెన్ భార్యపై దాడి చేసి చంపారు.
తిరుపతి జిల్లా మూలకండ్రిగలో 6ఏళ్ల బాలికను 65ఏళ్ల వృద్దుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటిదగ్గర ఆడుకుంటున్న పాపకు చాక్లెట్ ఆశచూపి బలరామయ్య ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక చికిత్స పొందుతుండగా పరారిలోవున్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఏపీ తిరుపతిలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. బీఎన్ కండ్రిగ మండలం పార్లవల్లి గ్రామం వద్ద కారు, బైక్ ను ఢీకొట్టింది.
సీబీఐ పేరుతో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే జయదేవనాయుడికి ఓ మహిళ ఫోన్ చేసి చేసింది. మీ ఖాతా నుంచి మనీల్యాండరింగ్ జరిగిందని బెదిరించింది. ఆమెతో పాటూ మరో నిందితుడు కలిపి జయదేవనాయుడి దగ్గర నుంచి రూ.50 లక్షలు దోచుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పాకాల పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తిరుపతిలో పారిశుధ్యలోపంపై కలెక్టర్ వెంకటేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే..తిరుపతి నగరంలోని స్కావెంజర్స్ కాలనీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తిరుపతి పారిశుద్ధ కార్మికుల పనితీరుపై మండిపడ్డారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు ఇక నుంచి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు.శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతలు ఇతర జంతువుల సంచారాన్ని గుర్తించేందుకు మరికొన్ని ట్రాప్ కెమరాలను ఏర్పాటు చేయాలన్నారు.
తిరుమలలో ఘోర ప్రమాదం జరిగింది. స్వామి వారి దర్శనానికి వస్తున్న తమిళనాడు భక్తులు ఈ ప్రమాదం లో తీవ్రంగా గాయపడ్డారు. కారు టైరు పగిలి..కరెంట్ స్తంభానికి ఢీకొనడంతో నలుగురు భక్తుల పరిస్థితి విషమంగా ఉంది.