తిరుమల లడ్డూ నాణ్యతపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
తిరుమల శ్రీవారి లడ్డూ నాణ్యతపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని అధికారులకు ఆదేశించారు. లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారు, ఇది ఇలాగే కొనసాగించాలని సూచించారు.
తిరుమలలో అపచారం.. టీటీడీ కీలక ప్రకటన!
AP: తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభంపై గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే తాలూకు కొక్కి విరిగిపోయిందని.. ఇది అపచారం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. దీనిని భక్తులు ఎవరు నమ్మొద్దని ఎక్స్లో టీటీడీ వివరణ ఇచ్చింది.
రేపు తిరుమలకు చంద్రబాబు.. ప్రభుత్వం తరుఫున పట్టువస్త్రాల సమర్పణ!
ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తిరుమలలో నూతనంగా నిర్మించిన వకుళామాత వంటశాలను సీఎం ప్రారంభించనున్నారు.
Pawan Kalyan: జ్వరంతో బాధపడుతున్న డిప్యూటీ సీఎం పవన్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.నడక మార్గంలో మొన్న తిరుమల చేరుకున్న ఆయన..తీవ్రమైన వెన్నునొప్పి కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.అతిథి గృహంలోనే వైద్యులు ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ తిరుమల పర్యటన ఖరారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటన ఖరారు అయ్యింది. తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలతో చేపట్టిన ప్రాయశ్చిత దీక్షను విరమించడానికి అక్టోబర్ 2వ తేదీన మెట్లమార్గంలో తిరుమలకు చేరుకోనున్నారు. మరుసటి రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకుని దీక్ష విరమించనున్నారు.
Tirumala Laddu : శ్రీవారి లడ్డూ కల్తీపై సిట్ నియామకం..
తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యిపై విచారణకు ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. సిట్ సభ్యులుగా డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్షవర్దన్ రాజు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలను నియమించింది.
Tirumala : ప్రసాదం గురించి.. సుప్రీం కోర్టుకు సుబ్రహ్మణ్య స్వామి!
తిరుపతి లడ్డూ వివాదంపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తిరుపతి దేవస్థానం ప్రసాదంలో జంతువుల మాంసం, కొవ్వులు కలిపి ప్రసాదాన్ని కల్తీ చేశారని సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు.