suryapet murder: నా కూతురిని ఇంటికి తెచ్చుకుంటాం.. భార్గవి తల్లి కన్నీటి కథ!
సూర్యాపేట పరువు హత్య కేసులో భార్గవి తల్లి తన బిడ్డ గురించి చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇదంతా జరిగినా సరే తమ కూతురిని తమతోపాటు తీసుకొస్తామని ఆవేదన వ్యక్తం చేశారు.
సూర్యాపేట పరువు హత్య కేసులో భార్గవి తల్లి తన బిడ్డ గురించి చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇదంతా జరిగినా సరే తమ కూతురిని తమతోపాటు తీసుకొస్తామని ఆవేదన వ్యక్తం చేశారు.
సూర్యాపేట పరువు హత్య కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. భార్గవి అన్నయ్య నవీన్తో పాటు బైరి మహేష్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు కూడా ఈ హత్యలో బాగమైనట్లు తెలుస్తోంది. భార్గవితో కులాంతర వివాహమే కృష్ణ హత్యకు కారణమని సమాచారం .
సూర్యాపేట జిల్లా మామిళ్ళగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కృష్ణను బండ రాళ్లతో కొట్టి హత్య చేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రేమవివాహమే ఈ హత్యకు దారి తీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.