suryapet murder: నా కూతురిని ఇంటికి తెచ్చుకుంటాం.. భార్గవి తల్లి కన్నీటి కథ!

సూర్యాపేట పరువు హత్య కేసులో భార్గవి తల్లి తన బిడ్డ గురించి చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇదంతా జరిగినా సరే తమ కూతురిని తమతోపాటు తీసుకొస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. 

New Update

Suryapet Murder: పరువు, కులం, మతం చాటున సాటి మనుషుల పట్ల విద్వేషాన్ని వెళ్లగక్కడం ఇటివలీ ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. కులం పేరిట హత్యలు జరగడం ఇప్పటి విషయం కాకున్నా శాస్త్రసంకేతిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న 21వ శతాబ్దాంలోనూ పరువు హత్యలు జరుగుతుండడం అత్యంత దుర్మార్గమైన విషయం. ముఖ్యంగా కులం కోసం కొట్టుకుచచ్చే వారు తెలుగురాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తారు. అలాంటి కుల హత్యే సూర్యాపేటలో జరగడం సమాజాన్ని తలదించుకునేలా చేసింది.

Also Read: ఏ-1 అన్న, ఏ4- నానమ్మ.. ఆయుధమే లేకుండా హత్య.. సూర్యాపేట ఎస్పీ షాకింగ్ ప్రకటన!

ఆవేదన తల్లి 

సూర్యాపేటలో  కృష్ణ అలియాస్‌ మాలబంటిని కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతో అమ్మాయి అన్నయ్య దారుణంగా హత్య చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భర్త, పిల్లలతో నూరేళ్ళ సంతోషంగా ఉండాల్సిన కూతురు పాతికేళ్లకే  భర్తను పోగొట్టుకొని దిక్కుతోచని స్థితిలో మిగిలిపోవడం. మరో వైపు కూతురి భర్తను చంపి కొడుకు జైలు పాలవడంతో ఆ కన్నతల్లి  తల్లడిల్లిపోతుంది. ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడిన భార్గవి తల్లి  తన బిడ్డ గురించి చెబుతూ  కన్నీటి పర్యంతమయ్యారు. 

ఇది కూడా చదవండి: Johny master : జానీ మాస్టర్ పై కేసు.. తొలిసారి నోరు విప్పిన కొరియోగ్రాఫర్.. సంచలన ఇంటర్వ్యూ!

నా కూతురిని మాతో పాటు తెచ్చుకుంటాము.. 

"కృష్ణను తన కుమార్తె ప్రేమించిన విషయం తమకు తెలియదని. కూతురి కోసం పోలీస్ కానిస్టేబుల్ సంబంధం తీసుకొచ్చి.. కట్నం కూడా మాట్లాడమని భార్గవి తల్లి తెలిపింది. కానీ, పెళ్లి కుదిరిన తర్వాత భార్గవి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్లారు.  తామెంత బ్రతిమాలిన భార్గవి తమ మాట వినిపించుకోలేదని తెలిపారు. దీంతో ఎలా జరిగితే అలా జరుగుతుందని భార్గవి ఇష్టప్రకారమే వదిలేసి వచ్చినట్లు చెప్పారు. ఇదంతా జరిగినా సరే తమ కూతురిని తమతోపాటు తీసుకొస్తామని భార్గవి తల్లి చెబుతున్నారు."

Also Read: Double ISMART: తెలుగులో ఫ్లాప్.. హిందీలో 100 మిలియన్ల వ్యూస్.. యూట్యూబ్ లో డబుల్ ఇస్మార్ట్ సర్ప్రైజ్!

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Big Breaking: విజయవాడ శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ కిడ్నాప్.. సీసీ కెమెరాలో  అంతా రికార్డ్..

విజయవాడలో శుక్రవారం రాత్రి ఓ ప్రైవేటు కాలేజీ ప్రిన్సిపాల్‌ కిడ్నాప్‌ కలకలం రేపింది. శాతవాహన కళాశాల ప్రిన్సిపాల్ వంకాలపాటి శ్రీనివాస్‌ను కొందరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. బందర్ రోడ్డులోని డి అడ్రస్ మాల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

New Update
Principal Srinivas

Principal Srinivas

Big Breaking:  విజయవాడలో శుక్రవారం రాత్రి ఓ ప్రైవేటు కాలేజీ ప్రిన్సిపాల్‌ కిడ్నాప్‌ కలకలం రేపింది. శాతవాహన కళాశాల ప్రిన్సిపాల్ వంకాలపాటి శ్రీనివాస్‌ను కొందరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. బందర్ రోడ్డులోని డి అడ్రస్ మాల్ వద్ద కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా గత కొంతకాలంగా వందల కోట్ల విలువైన కాలేజీ ఆస్తిపై వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రిన్సిపాల్ కిడ్నాప్ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్

Also Read: కన్నప్ప హార్డ్ డ్రైవ్ ను మనోజ్ ఇంట్లో పని వాళ్ళే దొంగిలించారు..విష్ణు

శుక్రవారం రాత్రి డీ అడ్రస్ మాల్ కు వెళ్లిన శ్రీనివాస్‌ తిరిగి వచ్చి తన కారు ఎక్కుతున్న క్రమంలో కిడ్నాపర్లు ఆయనను కారునుంచి దింపి తమతో తీసుకెళ్లారు. ఆయనను బలవంతంగా తీసుకెళ్లినట్లు గుర్తించిన సెక్యూరిటీ గార్డు విషయాన్ని డీ అడ్రస్‌ మాల్‌ యజమాని శ్రీకాంత్‌కు తెలిపారు. అప్రమత్తమైన ఆయన కృష్ణలంక పోలీసులకు సీపీకి సమాచారం అందించారు.

ఇది కూడా చదవండి: ఏపీలో మరో లవ్‌స్టోరీ.. ప్రేమ విఫలమైందని బాలిక ఆత్మహత్యాయత్నం

ఇది కూడా చదవండి: మూడు రాత్రులు.. గుండెపోటుకు కారణం.. షాకింగ్ నిజాలు

మరోవైపు కుటుంబసభ్యులు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి శ్రీనివాస్ కిడ్నాప్ పై ఫిర్యాదు చేశారు. విజయవాడ సీపీ కృష్ణలంక పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు సీసీ ఫుటేజ్ పరిశీలించారు. శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేసిన తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. అయితే శ్రీనివాస్ గాంధీనగర్ కి చెందిన వ్యక్తి కావడంతో అనంతరం కృష్ణలంక పోలీసులు  సత్యనారాయణపురం పోలీసులకు కేసు ట్రాన్స్‌ఫర్ చేశారు.

Also Read: పాకిస్తాన్ గేమ్ క్లోస్.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ ఏంటంటే?

 ప్రిన్సిపాల్ కిడ్నాప్ కథ సుఖాంతం

విజయవాడలో నిన్న సాయంత్రం కలకలం రేపిన శాతావాహన కాలేజీ ప్రిన్సిపాల్‌ వంకాయలపాటి శ్రీనివాస్ కథ సుఖాంతమైంది. సాయంత్రం ఆరుగంటలకు శ్రీనివాస్‌ను కిడ్నాప్‌ చేసిన దుండగులు అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో వదిలేశారు. నిన్న రాత్రి డీ అడ్రస్‌ మాల్‌కు వెళ్లిన సందర్భంలో శ్రీనివాస్‌ ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసి కారులో తీసుకెళ్లారు. దీంతో మాల్‌ యాజమానితో పాటు ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులకు సమాచారం చేరిందని తెలియడంతో కిడ్నాపర్లు ఆయనను వదిలేశారు. అయితే శాతవాహన కళాశాల స్థల వివాదం నేపథ్యంలోనే ఈ కిడ్నాప్‌ జరిగినట్లు తెలుస్తోంది. 2009 ఈ స్థలం వివాదంలో ఉంది. బోయపాటి, కామేశ్వరరావు మధ్య దీనిపై కోర్టులో కేసు నడుస్తోంది.కోర్టు లో‌ కేసు ఇప్పుడు లిస్టింగ్ అయ్యింది. పోలీసుల భయంతో కిడ్నాపర్లు ఆయనను వదిలిపెట్టారు.

Advertisment
Advertisment