ఎన్నికల డేట్లు ఇవే..! || Telangana Sarpanch Elections || CM Revanth Reddy || Congress || RTV
పార్టీ మారిన MLAలను అనర్హులుగా ప్రకటించాలని KTR వేసిన పిటిషన్ సోమవారం సుప్రీం కోర్టులో ధర్మసనం విచారించింది. రెండూ పిటిషన్లను కలిపి ఫిబ్రవరి 10న విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. గతంలో ముగ్గురు, ఇప్పుడు ఏడుగురు ఎమ్మెల్యేలపై విచారణ జరగనుంది.
తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్ల స్వీకరణ కూడా మొదలైంది. ఈ నెల 10 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారంటూ వచ్చిన వార్తలపై ఆ పార్టీ ఎంపీ మల్లు రవి స్పందించారు. ఎమ్మెల్యేల రహస్య భేటీ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే కొంతమంది ఎమ్మెల్యేలను ఓ హోటల్లో విందుకు ఆహ్వానించారన్నారు.
హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పోచారం మున్సిపాలిటీలోని నల్లామల్లా రెడ్డి కాలనీ కాంపౌండ్ వాల్ కూల్చివేశారు. మున్సిపల్ చట్టాలు, సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం రహదారిపై ఆక్రమణలను నోటీసు ఇవ్వకుండా కూల్చివేస్తామని హైడ్రా స్పష్టం చేసింది.
కమలాపూర్ ప్రజాపాలన గ్రామ సభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్,బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరగగా.. ఇరు పార్టీల నేతలు పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ శ్రేణులు టమాటాలు విసిరారు. కమలాపూర్ ఎంపీ ఈటల స్వగ్రామం
రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం చేజారడంతో నగర మేయర్, డిప్యూటీ మేయర్తోపాటు పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఫిబ్రవరి 10 నాటికి కౌన్సిల్ ఏర్పడి నాలుగేళ్లవుతుండటంతో మేయర్పై అవిశ్వాసం పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
హైదరాబాద్లోని చింతల్ బస్తీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బుధవారం హల్ చల్ చేశారు. హైడ్రా అధికారులు షాదన్ కాలేజ్ ఎదురుగా ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుండగా దానం నాగేందర్ అడ్డుకున్నారు. తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ ఫైర్ అయ్యారు.