Telangana : తెలంగాణ పోలీసుల రక్షణలోకి ఈగల్ స్క్వాడ్
తెలంగాణ పోలీసుల అమ్ములపొదిలోకి కొత్త ఆయుధాలు వచ్చి చేరాయి. రెండు కొత్త గ్రద్ధలను తమ స్క్వాడ్లో చేర్చుకున్నారు. డ్రోన్ అటాక్లను ముందే పసిగట్టేలా వీటికి శిక్షణ ఇప్పించారు.
తెలంగాణ పోలీసుల అమ్ములపొదిలోకి కొత్త ఆయుధాలు వచ్చి చేరాయి. రెండు కొత్త గ్రద్ధలను తమ స్క్వాడ్లో చేర్చుకున్నారు. డ్రోన్ అటాక్లను ముందే పసిగట్టేలా వీటికి శిక్షణ ఇప్పించారు.
రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన నలుగురు బలవన్మరణంకు సంబంధించి వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. 25లక్షలు కావాలని నలుగురు రిపోర్టర్లు, ఒక హోంగార్డు బ్లాక్ మెయిల్ చేయడంతోనే రవి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
జయశంకర్ వర్సిటీలో గతవారం ఏబీవీపీ మహిళా నాయకురాలు ఝాన్సీ జుట్టు పట్టుకున్న ఓ మహిళ కానిస్టేబుల్ ఆమెను కింద పడేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసు డిపార్టమెంట్ తీవ్ర విమర్శలను మూటగట్టుకుంది. తాజాగా ఝాన్సీ జుట్టు లాగిన మహిళా కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు
సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని మాదాపూర్ జోన్ నూతన డీసీపీ గా డాక్టర్ జి.వినీత్ ఐపీఎస్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. మాదాపూర్ జోన్ ఏడీసీపీ నంద్యాల నరసింహా రెడ్డి, ఏసీపీ లు, ఇన్ స్పెక్టర్లు మర్యాదపూర్వకంగా డీసీపీ ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ డీజీపీ కీలక ఆదేశాలు ఇచ్చారు. మద్యం తాగి వాహనాలు నడిపితే.. బండి సీజ్ చేసి, రూ. 10వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష విధించనున్నట్లు తెలిపారు.
తెలంగాణలో మరో సారి ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్లను ప్రకటించారు పోలీసులు. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై ఉన్న చలాన్లకు 90 శాతం డిస్కౌంట్, టూ వీలర్స్ కు 80 శాతం, ఫోర్ వీలర్స్, ఆటోలకు 60, భారీ వాహనాలపై ఉన్న చలానాలకు 50 శాతం డిస్కౌంట్ ప్రకటించారు.
రైల్వే స్టేషన్ లో చోరీకి గురైన ఇన్సాస్ గన్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ బుల్లెట్లను ఎత్తుకెళ్లిన ఇద్దరు నిందితులను కూడా అరెస్ట్ చేశారు. అయితే, విచారణలో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కానిస్టేబుల్ వద్దనున్న బ్యాగ్ చూసి డబ్బుల ఉన్నాయని అనుకుని చోరీకి పాల్పడ్డాడట దొంగ. ఓపెన్ చేయగా బుల్లెట్లు ఉండటంతో.. అక్కడే వదిలేశాడు. మరో వ్యక్తి ఆ బుల్లెట్లను తీసుకెళ్లి ఇంట్లో దాచిపెట్టాడు.
దేశ వ్యాప్తంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. అమరవీరులను స్మరించుకుంటూ.. వారికి నివాళులు అర్పిస్తూ దేశ వ్యాప్తంగా పోలీసులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహిస్తూ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద జరిగిన జాతీయ పోలీస్ స్మారక దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. పోలీసుల అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు.
ఎన్నికల ముంగిట తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో నలుగురు కలెక్టర్లు, 13 మంది ఎస్పీలు, సీపీలను బదిలీ చేసింది ఎన్నికల కమిషన్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక బదిలీ అయిన పోలీసు అధికారుల్లో తొమ్మిది మంది నాన్ క్యాడర్ అధికారులు ఉన్నారు.