Bhatti Vikramarka: భూమి లేని నిరుపేదలకు గుడ్ న్యూస్.. ఏటా రూ.12 వేలు
రాష్ట్రంలో భూములు లేని నిరుపేద కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా డిసెంబర్ 28న ప్రారంభించనున్నారు. ఆ రోజే లబ్ధిదారుల అకౌంట్లోకి తొలి విడత కింద రూ.6 వేలు జమ చేయనున్నారు.