Rat-Hole Mining Experts In SLBC Tunnel | ఆ ఒక్క పని చేస్తే...వాళ్ళని కాపాడవచ్చు | Rescue Operation
ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో 8మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్లుండి ఎస్ఎల్ బీసీ టన్నెల్ ను సందర్శిస్తామన్నారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు ప్రభుత్వం శ్రమిస్తోంది. ఈ క్రమంలో టన్నెల్ వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ఇలాంటి ప్రమాదం ఉత్తరఖాండ్ లో జరిగింది. ఇది దేశ చరిత్రలో 3 వ టన్నెల్ ప్రమాదమని నిపుణులంటున్నారు.
SLBC ప్రమాదంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కన్వేయర్ బెల్టుపై నడుస్తూ స్పాట్కు చేరుకున్న జియాలజిస్టులు బురద నీరు పెరుగుతున్నట్లు తెలిపారు. కన్వేయర్ బెల్టు ఏక్షణమైనా తెగిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఆ 8 మంది కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
SLBC టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ 8 మందితో కాంటాక్ట్ కావాడానికి NDRF బృందం ప్రయత్నిస్తోంది. 200 మీటర్లు మట్టి కూరుకుపోవడంతో ఆచూకి కష్టంగా మారిందని డిప్యూటీ కమాండర్ సుఖేందు తెలిపారు. 1శాతం మాత్రమే వారు బతికే ఛాన్స్ ఉందంటున్నారు.
నాగర్ కర్నూల్ SLBC టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల వరకు రెస్క్యూటీమ్స్ తీవ్రంగా శ్రమించింది. టన్నెల్లో 2.5మీటర్ల ఎత్తున బురద పేరుకుందని, ఊట వల్ల మట్టిని తొలగించడం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు.