నా కూతురు,కొడుకు పై తప్పుడు రాతలు రాస్తే..| Y S Vijayamma | RTV
నా కూతురు,కొడుకు పై తప్పుడు రాతలు రాస్తే..| Y S Vijayamma clarifies about negative comments being posted about her Son Jagan and Sharmila RTV
నా కూతురు,కొడుకు పై తప్పుడు రాతలు రాస్తే..| Y S Vijayamma clarifies about negative comments being posted about her Son Jagan and Sharmila RTV
ఎప్పుడో జరిగిన తన కారుప్రమాదాన్ని ఇప్పుడు జరిగినట్లుగా ప్రచారం చేయడంపై వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. తన కుమారుడు జగనే ఆపని చేయించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు. అయితే విజయమ్మ పేరుతో వైసీపీ వాళ్లే ఫేక్లెటర్ రిలీజ్ చేశారని టీడీపీ ఆరోపణ చేస్తుంది.
వైఎస్ విజయమ్మ మరో లేఖ విడుదల చేశారు. ఎప్పుడో జరిగిన తన కారు ప్రమాదాన్ని ఇప్పుడు జరిగినట్లుగా చిత్రీకరిస్తున్నారన్నారు. ఈ ప్రమాదానికి తన కుమారుడు కారణమన్నట్లుగా దుష్ఫ్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే ఇక మీదట ఊరుకోనన్నారు.
వైఎస్ జగన్, షర్మిల విభేదాలు రచ్చకెక్కడంతో వారి ఫ్యామిలీ రెండుగా చీలిపోయింది. సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు జగన్ వెంట ఉండగా.. విజయమ్మ, సునీత, సౌభాగ్యమ్మ తదితరులు షర్మిల వైపు ఉన్నారు.
వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తి వివాదం అనంతరం తాజాగా వైఎస్ విజయమ్మ ఎమోషనల్ లేఖ రాశారు. ‘‘ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా బాదేస్తుంది. నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో నాకు అర్థం కావడం లేదు. జరగకూడనివన్నీ నా కళ్ళముందే జరిగి పోతున్నాయి’’ అన్నారు.