రాహుల్ గాంధీకి స్మాల్ రిక్వెస్ట్... ! | Dasoju Sravan Small Request To Rahul Gandhi | RTV
రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని ఏడాదికి రెండు సార్లు అందిస్తారు. అయితే రైతులు మళ్లీ ఎలాంటి ధరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వ్యవసాయ యోగ్యమైన భూమికే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. షరుతులు లేకుండా పండించిన ప్రతి పంటకు సాయాన్ని అందిస్తారు.
రైతు భరోసా పథకం కోసం కొత్తగా దరఖాస్తులు తీసుకోవాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెల 5 నుంచి 7 వరకు గ్రామసభలు నిర్వహించాలని కేబినెట్ సబ్ కమిటీ సూచించినట్లు సమాచారం. రేపు జరిగే కేబినెట్ మీటింగ్ లో ఈ అంశంపై ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు.
రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. నిధులు పక్కదారి పట్టకుండా పంపిణీలో టెక్నాలజీని ఉపయోగించాలని భావిస్తోంది. రైతులనుంచి దరఖాస్తులు సేకరించేందుకు ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
రైతు భరోసాపై లిమిట్ పెట్టాలని తెలంగాణకి కేబినేట్ సబ్ కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు గ్రూప్-1 ఆఫీసర్లకు రైతు భరోసా ఇవ్వకూడదని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది.