Sonia Gandhi:రాజ్యసభ కోసం రాజస్థాన్ నుంచి సోనియా నామినేషన్
రాజ్యసభ సభ్యురాలిగా కాంగ్రెస్ ముఖ్యనేత సోనియా గాంధీ తన నామినేషన్ను దాఖలు చేశారు. ప్రియాంక, రాహుల్ గాంధీ వెంట రాగా...జైపూర్లో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు సోనియా గాంధీ.
రాజ్యసభ సభ్యురాలిగా కాంగ్రెస్ ముఖ్యనేత సోనియా గాంధీ తన నామినేషన్ను దాఖలు చేశారు. ప్రియాంక, రాహుల్ గాంధీ వెంట రాగా...జైపూర్లో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు సోనియా గాంధీ.
తెలుగు ఆడపడుచు, ఫైర్ బ్రాండ్ కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి రేణుకాచౌదరి పేరును ఖరారు చేశారు. హైకమాండ్ కూడా ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాసేపట్లో నామినేషన్ దాకలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై స్పందిస్తూ, యూపీఏ హయాంలో పీఎస్యూలను కాంగ్రెస్ నిర్వీర్యం చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. బిజెపి పాలనలో పిఎస్యుల సంఖ్య పెరిగిందని, వాటి లాభాలు పెరిగాయని ఆయన ఉద్ఘాటించారు.బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ , ఎయిర్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ సర్వనాశనం చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు మోదీ సమాధానం ఇచ్చారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లను ఆనాడు నెహ్రు వ్యతిరేకించారని మోదీ గుర్తు చేశారు. కావాలంటే రికార్డులను చూడాలని కాంగ్రెస్ ను కోరారు ప్రధాని మోదీ.
కాంగ్రెస్ పార్టీ మీద ఫుల్ సెటైర్లేశారు ప్రధాని మోదీ. రాహుల, సోనియాలను మిస్ అయ్యాము అనుకున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఆ లోటును తీర్చారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు 40 సీట్లు కూడా రావని అన్నారు.
రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ను విడుదల చేశారు. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఏపీలో 3, తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
కేంద్ర ఎన్నికల కమిషన్కు సంబంధించి ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) , ఎన్నికల కమిషనర్ (ఈసీ) బిల్లు-2023 ను కేంద్రం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఈసీ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉందని విపక్షాలు వ్యతిరేకించినప్పటికీ..మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది.
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. జనగణన, డీలిమిటేషన్ అంటూ ఈ బిల్లుకు ముడి పెట్టడం బాలేదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 215 ఓట్లు పోలయ్యాయి. రాజ్యసభలో తన ప్రసంగంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ మహిళా శక్తికి ప్రత్యేక గౌరవం లభిస్తోందని, కేవలం బిల్లు ఆమోదం పొందడం వల్లనే కాదని, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లు పట్ల సానుకూలంగా ఆలోచించడం దేశానికి ఊతమిస్తోందని అన్నారు. మన దేశానికి మహిళా శక్తి.. ఇది కొత్త శక్తిని ఇస్తుంది. అంతకుముందు బుధవారం లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు (Nari Shakti Vandan Act Bill) 454 ఓట్లతో ఆమోదం పొందింది. లోక్సభలో అసదుద్దీన్ ఒవైసీ, ఇంతియాజ్ జలీల్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు.