పార్లమెంట్ లో తళుక్కుమన్న హీరోయిన్ తమన్నా
సినీ నటి తమన్నా భాటియా పార్లమెంట్ లో మళుక్కుమన్నారు. గత రెండు రోజులుగా కొత్త పార్లమెంట్ భవనాన్ని సెలబ్రిటీలు సందర్శిస్తున్నారు. రెడ్ కలర్ వారీలో వచ్చిన తమన్నా అక్కడ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.
సినీ నటి తమన్నా భాటియా పార్లమెంట్ లో మళుక్కుమన్నారు. గత రెండు రోజులుగా కొత్త పార్లమెంట్ భవనాన్ని సెలబ్రిటీలు సందర్శిస్తున్నారు. రెడ్ కలర్ వారీలో వచ్చిన తమన్నా అక్కడ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.
పార్లమెంటు సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర న్యాయశాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
కొత్త పార్లమెంటు భవనంలో లోక్ సభతో పాటూ ఈరోజు రాజ్యసభ కూడా కొలువు తీరింది. రానున్న రోజుల్లో భారత్ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా మారబోతోందని...దానికి కొత్త పార్లమెంట్ సాక్ష్యంగా నిలుస్తుందని ఆయన అన్నారు.
రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ (Aap)ఎంపీ (mp)రాఘవ చద్దాపై సస్పెన్షన్ వేటు పడింది. సభా హక్కులను ఉల్లంఘించారన్న కారణాలపై ఆయన్ని సభ నుంచి సస్పెండ్ చేశారు. ఫోర్జరీ సంతకాల కేసులో దర్యాప్తు జరుపుతున్న సభాహక్కుల కమిటీ తన నివేదికను సమర్పించే వరకు ఆయన పై సస్పెన్షన్ కొనసాగనుంది.
నిశికాంత్ స్పీచ్పై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాహుల్పై నిన్న దూబే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్కు చైనా నుంచి డబ్బు వచ్చిందన్న దూబే వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడుతోంది. ఆ మాటల్ని ప్రసంగం నుంచి స్పీకర్ తొలగించారు. కానీ తొలగించిన దూబే స్పీచ్ను లోక్సభ వెబ్సైట్లో అప్లోడ్ చేయడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది.
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్-2023 బిల్లుకు లోక్సభలో ఆమోదం లభించింది. ఈ బిల్లును జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించడంతో ఆగస్టు 3వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(సవరణ బిల్లు)- 2023ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు రాజ్యసభలో ప్రవేశ పెట్టనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ అధికారుల బదిలీలు, నియామకాలపై అధికారాన్ని లెఫ్ట్ నెంట్ గవర్నర్ కట్టబెట్టేందుకు ఈ బిల్లు రూపొందించింది.