Telangana : 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారు : ఉత్తమ్
రాష్ట్రంలో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పని ఖతమైపోతుందని వ్యాఖ్యానించారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టారంటూ తీవ్ర విమర్శలు చేశారు.