ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన కోమటిరెడ్డి, పొన్నం
నల్లగొండ బస్ స్టాండ్ లో నూతన బస్సులను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం బస్ స్టాండ్ నుంచి జ్యోతిరావు పూలే భవన్ వరకు ఆ బస్సులో ప్రయాణించారు.
నల్లగొండ బస్ స్టాండ్ లో నూతన బస్సులను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం బస్ స్టాండ్ నుంచి జ్యోతిరావు పూలే భవన్ వరకు ఆ బస్సులో ప్రయాణించారు.
TG: త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం డీఏ ఇచ్చామని చెప్పారు. రూ.280 కోట్ల బకాయిల్లో రూ.80 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. మిగిలిన రూ.200 కోట్లను నెలాఖరులోగా చెల్లిస్తాం అని అన్నారు.
తెలంగాణలో బస్సుల సంఖ్య పెంచనున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కొత్తగా 1000 బస్సులు కొన్నామని.. మరో 1500 బస్సులకు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. అలాగే అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఏసీ బస్సులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
తన ప్రతిష్టను దిగజార్చే విధంగా అసభ్యకర వీడియోలు క్రియేట్ చేస్తున్నారని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొన్నం ప్రభాకర్, తనను దారుణంగా ట్రోల్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ సంస్థలో తర్వలో ఉద్యోగాలు భర్తీ చేయనుంది. మొత్తం 3,305 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 2 వేల డ్రైవర్ ఉద్యోగాలు, 743 శ్రామిక్ ఉద్యోగాలు ఉన్నాయి.
హుజూరాబాద్ రాజకీయం మరింత వేడెక్కింది. పొన్నం ప్రభాకర్ కు మద్ధతుగా కాంగ్రెస్ నేత ప్రణవ్ విసిరిన సవాల్ను స్వీకరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి తడిబట్టలతో హనుమాన్ ఆలయంలో ప్రమాణం చేయడానికి వెళ్తుండగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఇంట్లోనే ప్రమాణం చేశారు కౌశిక్.
ఎన్నికల వేళ ప్రధాని మోదీ ముఖంలో భయం కనిపిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అర్బన్ టెర్రరిజంపై ప్రధాని చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు.
తెలంగాణలో సాగు, తాగు నీరు.. కరెంట్ కష్టాలు. వడ్లకు బోనస్. కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు. నెక్ట్స్ సీఎం కోమటిరెడ్డి. ఆరు గ్యారెంటీల అమలు. ఎమ్మెల్యేల జంపింగ్. కాంగ్రెస్ కూలిపోబోతుంది నిజమేనా? వంటి సంచలన విషయాలపై Rtvతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఫేస్ టూ ఫేస్.
కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానని బండి సంజయ్ అన్నారని.. మరి కేంద్రంలో పదేళ్ల పాలనలో బీజేపీ ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఇది నిరూపిస్తే కరీంనగర్ నుంచి తమ పార్టీ అభ్యర్థి తప్పుకుంటారని అన్నారు.