BJP BC Sabha: రేపు హైదరాబాద్ కు ప్రధాని మోదీ..
తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. బీజేపీ కూడా ఇందుకు సిద్ధమైంది. రేపు తెలంగాణ బీజేపీ ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ హైదరాబాద్ కు రానున్నారు.
తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. బీజేపీ కూడా ఇందుకు సిద్ధమైంది. రేపు తెలంగాణ బీజేపీ ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ హైదరాబాద్ కు రానున్నారు.
80 కోట్ల పేద కుటుంబాలకు వచ్చే ఐదేళ్లపాటు ఉచిత రేషన్ పథకం ప్రయోజనాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఛత్తీస్గఢ్లోని దుర్గ్లో తెలిపారు.
కాంగ్రెస్, అభివృద్ధి ఈ రెండు కూడా ఒకదానితో మరొకటి కలిసి ముందుకు వెళ్లలేవని ప్రధానీ మోదీ విమర్శించారు.చత్తీస్గడ్లోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన భూపేశ్ బఘేల్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు.
తెలంగాణకు ప్రధాని మోదీ రానున్నారు. ఈ నెల 7,11 తేదీల్లో బీజేపీ నిర్వహించే పలు సభల్లో పాల్గొననున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర బీజేపీ నేతల కోసం మూడు హెలికాప్టర్లు కేటాయించింది.
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి తేది ఖరారైంది. దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి వచ్చే ఏడాది జనవరి 22న రామమందిరాన్ని ప్రారంభించాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆహ్వానం పలికారు. వారి ఆహ్వానాన్ని స్వీకరించిన ప్రధాని.. నా జీవితకాలంలో ఈ చారిత్రాత్మక సందర్భాన్ని చూడటం నా అదృష్టమని ఎక్స్లో పేర్కొన్నారు.
దసరా పండుగ సందర్భంగా ప్రధాని మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రతి చెడు అంశంపై దేశభక్తి సాధించిన విజయానికి ప్రతీకే దసరా పండుగ అని తెలిపారు. సమాజంలో కులతత్వం, ప్రాంతీయతత్వాన్ని రూపుమాపాలన్నారు.చంద్రయాన్-3 సక్సెస్ కావడం, కొత్త పార్లమెంటు భవనం ప్రారంభించడం, మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం వంటి శుభపరిణామాల మధ్య ఈరోజు దసరా పండుగను జరుపుకుంటున్నామని ప్రధాని అన్నారు. అలాగే ప్రతిఒక్కరూ 10 ప్రతిజ్ఞలు చేయండని పిలుపునిచ్చారు.
భారత అంతరిక్ష పరిశోధనలో మరో సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఇప్పటివరకు కేవలం ఉపగ్రహాలు, రాకెట్ లాంచింగ్ వంటి పరిశోధనలకు మాత్రమే పరిమితమైనటువంటి ఇస్రో తాజాగా అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ను సైతం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు ప్రధాని మోదీ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇస్రో రాబోయే 20 సంవత్సరాలకు గాను ఇప్పటినుంచే ప్లాన్స్ మొదలు పెట్టేసింది 2025 నాటికి ఎట్టకేలకు రోదసిలోకి భారతీయుడిని పంపాలని కృత నిశ్చయంతో ముందుకు అడుగులు వేస్తోంది. చంద్రయాన్ ఇచ్చినటువంటి ఉత్సాహాన్ని గగన్ యాన్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కొనసాగుతున్న వేళ.. గాజాలోని ఆసుపత్రిలో చోటుచేసుకున్న పేలుడు ఘటనపై భారత ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఈ దారుణమైన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పౌరుల మరణాలు చాలా తీవ్రమైన అంశమని, ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.
2040నాటికి భారతీయుడు చంద్రుడిపై కాలుమోపేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు సూచించారు. మన సొంతంగా భారత అంతరిక్ష కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసేకునే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్నారు. భారత్ యొక్క గగన్యాన్ మిషన్ పురోగతిని అంచనా వేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాల భవిష్యత్తు రూపురేఖల తయారీకి సంబంధించి చర్చించారు.