Pithapuram Floods: పిఠాపురాన్ని ముంచెత్తుతున్న వరదలు
భారీ వర్షాలు పిఠాపురాన్ని వరదలతో ముంచెత్తుతున్నాయి. నిన్న రాత్రి ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.
భారీ వర్షాలు పిఠాపురాన్ని వరదలతో ముంచెత్తుతున్నాయి. నిన్న రాత్రి ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.
డిప్యూటీ సీఎం పవన్ ఇలాకా పిఠాపురం మున్సిపల్ సమావేశంలో ఇద్దరు అధికారులు కొట్టుకున్నారు. కమిషనర్ కనక రాజు, డీఈ భవాని శంకర్ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇంజనీరింగ్ బిల్లులు డీఈ తప్పుగా పెట్టడంపై మొదలైన గొడవ కొట్టుకునే వరకు దారి తీసినట్లు తెలుస్తోంది.
శ్రావణ మాస చివరి శుక్రవారం నాడు పిఠాపురం ఆడపడుచులకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చీర, పసుపు, కుంకుమలను కానుక కింద అందజేయనున్నారు. పాదగయలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించి ఈ కానుకలను అందజేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
పిఠాపురంలో జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. స్థానికంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్పై స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటో పెట్టకపోవడంపై నిరసనకు దిగారు. ఎన్టీఆర్, చంద్రబాబుతో పాటు పవన్ ఫొటో కూడా పెట్టాలని డిమాండ్ చేశారు.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి గుడ్బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాంటి పదవి ఆశించకుండా జనసేన పార్టీలో చేరబోతున్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో దొరబాబును కాదని వంగా గీతకు పిఠాపురం టికెట్ ఇచ్చింది వైసీపీ హైకమాండ్.
పోలీసుల తీరుపై పిఠాపురం మాజీ టీడీపీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 40 రోజులు క్రితం యు.కొత్తపల్లి మండలం కొండవరం గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేసినా పోలీసులు ఇంత వరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
పిఠాపురంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు చెరువుల్లా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో కరెంట్ వైర్ రోడ్డుపై తెగిపడటంతో తీగ తగిలి ఆవు మృతి చెందింది. రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న కరెంటు స్తంభాల వైర్లను అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో స్థానికులు మండిపడుతున్నారు.
పిఠాపురంలోని తాటిపర్తి గ్రామంలో ఆధిపత్యం కోసం జనసేన, టీడీపీ నేతల మధ్య వివాదం ముదురుతోంది. శ్రీ అపర్ణ సమేత నాగేశ్వర స్వామి ఆలయ కమిటీలో జనసేన నాయకులనే కమిటీ చైర్మన్గా పెట్టారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఆలయం ఎదుట టెంట్ వేసి దీక్ష చేపట్టారు.
నిర్మాత SKN ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. పవన్కల్యాణ్ పిఠాపురంలో గెలిచిన తర్వాత ఆయన అభిమాని మరియమ్మ కుటుంబానికి ఆటో రిక్షా కొనిస్తానని చెప్పాడు. అన్నట్లుగానే ఆమె ఇంటికి వెళ్లిన ఆయన ఆటోను కానుకగా ఇచ్చారు. దీంతో SKN పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.