J&K TerrorAttack: పహల్గాం ఉగ్రదాడి.. ఇద్దరు ఏపీ వాసులు మృతి !
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు మృతి చెందారు. విశాఖ కు చెందిన రిటైర్ట్ ఉద్యోగి చంద్రమౌళి ఒకరు.నెల్లూరు కావలికి చెందిన మధుసూదన్ గా అధికారులు గుర్తించారు.
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు మృతి చెందారు. విశాఖ కు చెందిన రిటైర్ట్ ఉద్యోగి చంద్రమౌళి ఒకరు.నెల్లూరు కావలికి చెందిన మధుసూదన్ గా అధికారులు గుర్తించారు.
ఏపీలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. నెల్లూరు జిల్లా కావలిలో పట్టపగలే తాళాలు వేసిన ఇళ్లలోకి దూరి భారీగా దోచుకెళ్లారు. ఒకేరోజు నాలుగు ఇళ్లలో సుమారూ 70 సవరణల బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నెల్లూరులో వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఏకంగా రెండు హత్యలతో నెల్లూరు నగరం ఉలిక్కిపడుతోంది. వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. అయ్యప్ప గుడి సెంటర్లో బక్షు అనే వ్యక్తిని అతికిరాతకంగా పొడిచి పొడిచి మరి చంపేశారు.
అల్లూరు రైల్వే స్టేషన్, పడుగుపాడు రైల్వే స్టేషన్లల మధ్య వెళ్తున్న చండీగఢ్ - మదురై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్టేషన్ కంటే ముందే రైలును ఆపేసి దోపిడీకి తెగబడ్డారు. S2, S4, S5కోచ్లలో కత్తులు చూపించి బంగారు నగలు, బ్యాగులను ఎత్తుకెళ్లారు.
ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ ఇష్యూలో పొదలకూరు పీఎస్లో కేసు నమోదైంది. రూ.250 కోట్ల క్వార్ట్జ్ దోపిడీ చేశారనే ఫిర్యాదుపై మరో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ బుక్కైంది. ఇప్పటికే ఇద్దరు అరెస్ట్ అయ్యారు.
ఆస్తి కోసం తండ్రిపై కొడుకు కాల్పులకు తెగబడ్డ ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. హితేష్ కుమార్ జైన్ అనే వ్యక్తి ఆస్తిలో వాటా కోసం తండ్రి రాజ్మల్ జైన్ ఇంటి పై దాడికి తెగబడ్డాడు. ఈ క్రమంలోనే తుపాకీతో కాల్పులు జరిపాడు.
నెల్లూరులో జరిగిన మంత్రుల పర్యటన సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడారు. లక్ష 32 వేల మందికి స్వయం ఉపాధిని కల్పించేందుకు పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఇస్తామన్నారు.
ఏపీ నెల్లూరు జిల్లాలో మరో ఘోరం జరిగింది. గూడూరు పట్టణ సమీపంలోని పంబలేరు వాగులో ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల సెకండ్ ఇయర్ విద్యార్థిని లేహానెస్సి మృతదేహం కలకలం రేపుతోంది. ఆమెను హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పండుగ ఏదైనా సరే నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని నాగులపాడు గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ ఉన్న 150 కుటుంబాలు కుల,మత భేదాలు లేకుండా ప్రతి పండుగను ఒకేచోట కలిసి జరుపుకుంటారు. సర్వమత సమ్మేళనంగా ఒకే చోట వంట చేసుకొని భోజనాలు చేసి సంబరాలు చేసుకుంటారు.