MLC Kavitha: ఇంటి భోజనం ఇవ్వట్లేదు.. కోర్టులో కవిత పిటిషన్!
తనకు జైలులో తినడానికి ఇంటి భోజనం అనుమతించడం లేదని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్సీ కవిత. కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు.
తనకు జైలులో తినడానికి ఇంటి భోజనం అనుమతించడం లేదని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్సీ కవిత. కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి కేజ్రీవాల్ రేపు పూర్తి వివరాలను బయటపెడతారని ఆయన భార్య సునీత చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది.ఆయన ఏం చెబుతారన్న చర్చ జోరుగా సాగుతోంది.కవిత ప్రమేయంపై ఎలాంటి విషయాలు వెల్లడిస్తారోనని బీఆర్ఎస్ శ్రేణులు ఉత్కంఠగా ఉన్నారు.
నిన్న కోర్టు ఆర్డర్ తర్వాత ఈడీ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించారు. అక్కడ ఆమెకు ఖైదీ నంబర్ 666 ను కేటాయించారు. అయితే మొదటి రోజు జైల్లో కవిత చాలా డల్గా ఉన్నారని తెలిసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ తగిలింది. రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది. ఏప్రిల్ తొమ్మిది వరకు కోర్టు రిమాండ్ ఇచ్చింది. దాంతో పాటూ ఆమెను జైలుకు తరలించాలని అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రిమాండ్ ముగియడంతో ఈ రోజు ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఇది అక్రమ కేసు అని.. రాజకీయ కుట్రతో పెట్టినదని అన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకు కస్టడీ షాక్ తగిలింది.. ఇవాళ్టితో కవిత ఈడీ కస్టడీ ముగియగా అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. మరో ఐదు రోజుల కస్టడీకి ఈడీ కోరగా.. కోర్టు మాత్రం మూడు రోజుల కస్టడీకి అంగీకరించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. తనకు హైబీపీ ఉందని పిటిషన్లో పేర్కొన్న కవిత.. మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వడం లేదని చెబుతున్నారు. వైద్య పరీక్షల రిపోర్ట్ ఇవ్వాలని కవిత పిటిషన్ ఫైల్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో సంబంధం ఉందని భావిస్తున్నా ఏ ఒక్కరిని వదలకుండా ఈడీ సోదాలు చేస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ తనిఖీలు చేస్తోంది. హైదరాబాద్ మాదాపుర్లో ఉన్న కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి.
ఢిల్లీలో పరిస్థితులు హాట్ హాట్గా ఉన్నాయి. మరికాసేపట్లో అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ను ఈడీ పదిరోజుల కస్టడీకి కోరనుంది. అప్పుడు కవిత, కేజ్రీవాల్ ఇద్దరినీ ఒకే చోట కస్టడీకి ఉంచుతారని చెబుతున్నారు.