మంత్రాల భయంతో మహిళను పెట్రోల్ పోసి తగలబెట్టిన గ్రామస్థులు.!
మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రామాయంపేట మండలానికి చెందిన ద్యాగల ముత్తవ్వ ఊళ్ళో మంత్రాలు చేస్తుందనే భయంతో గ్రామస్థులు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పటించారు. బాధితురాలి కేకలు విని స్థానికులు ఆమెను ఆసుపత్రికి తలరించగా మార్గం మధ్యలోనే మృతి చెందింది.
చావుకు డప్పు కొట్టలేదని కుల బహిష్కరణ..19 మంది కుల పెద్దలు అరెస్ట్!
డప్పుకొట్టేందుకు రావట్లేదని కులపెద్దలు ఓ కుటుంబాన్ని బహిష్కరించిన ఘటన మెదక్ జిల్లా గౌతోజిగూడలో చోటుచేసుకుంది. బాగా చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడిన అన్నదమ్ములు చంద్రం, అర్జున్ను వెలివేయగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 19 మంది పెద్ద మనుషులను అరెస్ట్ చేశారు.
ఐదేళ్ల చిన్నారిపై హత్యాచారం.. నిందితుడికి మరణ శిక్ష
సంగారెడ్డి జిల్లా భానూర్లో గత ఏడాది ఓ ఐదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడికి పోక్సో కోర్టు మరణ శిక్ష విధించింది. అలాగే బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
Telangana: పెళ్ళి చేయలేనన్న భయంతో కూతురిని చంపేసిన తండ్రి
మెదక్ జిల్లాతో ఘోరం చోటు చేసుకుంది. తన కూతురికి ఎక్కడ పెళ్ళి చేయాల్సి వస్తుందోనన్న భయంతో కన్న తండ్రే ఆమెను చంపేశాడు. కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి హత్య చేశాడు. మే31న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. గర్భిణితో సహా శిశువు మృతి
మెదక్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మనోహరాబాద్ నుంచి దండుపల్లికి భార్యభర్తలు బైక్పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడునెలల గర్భిణీ అక్కడిక్కడే మృతి చెందారు. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.
Gurukul Students : గురుకుల హాస్టల్ లో విద్యార్థినులను కొరికిన ఎలుకలు!
మెదక్ జిల్లాలోని ఓ సాంఘిక గురుకుల హాస్టల్ లో ఎలుకలు కొరకడంతో 12 మంది విద్యార్థినులు గాయపడ్డారు.బుధవారం రాత్రి 12 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచాయి. విషయం తెలిసి విద్యార్థినుల తల్లిదండ్రులు గురువారం హాస్టల్కు చేరుకుని సిబ్బందిని ఈ విషయం గురించి నిలదీశారు.
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం ...రెండు లారీలు ఢీ.. నలుగురు మృతి
తెలంగాణలోని మెదక్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు లారీలు ఢీకొట్టుకోవడంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం వద్ద బైపాస్ రోడ్డు పై ఈ ప్రమాదం జరిగింది.