Maldives: మళ్లీ మాల్దీవులతో దోస్తానా? విదేశాంగ మంత్రితో మాల్దీవుల ప్రెసిడెంట్ భేటీ!
మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న తర్వాత ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో సమావేశమయ్యారు. ఇరుదేశాల సంబంధాలు క్షీణించిన క్రమంలో జరిగిన ఈ భేటీ రాబోయే రోజుల్లో రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.