Telangana MP's: రాజీనామాలు చేసిన తెలంగాణ ఎంపీలు
తెలంగాణ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు.
తెలంగాణ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు.
జీరో అవర్ జరుగుతున్న సమయంలో లోక్సభలోకి చోరబడిన వ్యక్తుల వివరాలు బయటపడ్డాయి. మైసుర్కు చెందిన మనోరంజన్, సాగర్ లోక్సభ లోపలోకి దూసుకురాగా.. నీలంకౌర్(హర్యానా), అమోల్(మహారాష్ట్ర) పార్లమెంటు ఆవరణలోని ట్రాన్స్పోర్ట్ భవన్ వద్ద ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
పారిశ్రామికవేత్త నుంచి డబ్బులు తీసుకోని లోక్సభలో ప్రశ్నలు అడిగారని ఆరోపణల నేపథ్యంలో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్సభ సభ్యత్వాన్ని పార్లమెంటు రద్దు చేసింది. దీంతో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా తమను అణిచివేసేందుకే కుట్ర చేశారని మహువా మండిపడ్డారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. జనగణన, డీలిమిటేషన్ అంటూ ఈ బిల్లుకు ముడి పెట్టడం బాలేదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 215 ఓట్లు పోలయ్యాయి. రాజ్యసభలో తన ప్రసంగంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ మహిళా శక్తికి ప్రత్యేక గౌరవం లభిస్తోందని, కేవలం బిల్లు ఆమోదం పొందడం వల్లనే కాదని, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లు పట్ల సానుకూలంగా ఆలోచించడం దేశానికి ఊతమిస్తోందని అన్నారు. మన దేశానికి మహిళా శక్తి.. ఇది కొత్త శక్తిని ఇస్తుంది. అంతకుముందు బుధవారం లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు (Nari Shakti Vandan Act Bill) 454 ఓట్లతో ఆమోదం పొందింది. లోక్సభలో అసదుద్దీన్ ఒవైసీ, ఇంతియాజ్ జలీల్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు.
పార్లమెంటు సమావేశాల్లో మూడవ రోజు చర్చ ప్రారంభం అయింది. మహిళా బిల్లుకు తాము పూర్తిగా మద్దతునిస్తున్నామని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ప్రకటించారు.
Prime Minister Narendra Modi : కేంద్రంలోని మోదీ సర్కార్ పై ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రెండు రోజులుగా చర్చ సాగుతూనే ఉంది. దీనిపై ఆగస్టు 10 శుక్రవారం ఓటింగ్ జరగనుంది. అవిశ్వాసంపై చర్చకు నేడు ప్రధానమంత్రి సమాధానం చెబుతారు. ప్రధాని ఏం మాట్లాడుతారోనని ఉత్కంఠ నెలకొంది.
లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ జరిగింది. దీనిపై మాట్లాడిన ఎంపీ నామా.. విభజన చట్టం హామీలను నెరవేర్చాలని 9 ఏంళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నప్పటికీ, ఎలాంటి స్పందన లేదన్నారు. కేంద్రం సహకరించకున్నా.. తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది ఎంపీ నామా నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు