Jaggareddy: ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదు
తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇంతకాలం ఓపిగ్గా ఉన్నానని.. ఇకపై ఓపిక పట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరోసారి తనపై తప్పుడు ప్రచారం చేస్తే తన అనుచరులకు అప్పగిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.