/rtv/media/media_files/2025/08/12/bandi-1-2025-08-12-18-55-36.jpg)
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. నిజం సింహం లాంటిది, తనను తానే రక్షించుకుంటుందని సంజయ్ వాఖ్యనించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా జీవితాలు నాశనం చేసిన నేరస్థులు తప్పించుకోలేరని సంజయ్ చెప్పారు. నిజం..ఎప్పటికైనా గెలిచి తీరుతుందన్నారు. కాగా ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్పై సంచలన ఆరోపణలు చేశారు.
Game On. No question of fearing legal notices.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 12, 2025
Truth is a lion; set it free and it will defend itself.
Criminals who ruined lives through phone tapping will be exposed.
Satyameva Jayate!!
కేంద్రమంత్రిగా ఉండి బాధ్యతారహితంగా
బండి ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేటీఆర్.. ఆయనకు ఇవాళ నోటీసులు పంపించారు. కేంద్రమంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రజాప్రతినిధిపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదంటూ నోటీసుల్లో వెల్లడించారు. ఈ నోటీసులో బండి సంజయ్ నిరాధారమైన ఆరోపణలు చేశారని, దీని వల్ల తన పరువుకు నష్టం వాటిల్లిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ నోటీసులు అందుకున్న ఏడు రోజుల్లోగా బండి సంజయ్ స్పందించకపోతే సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటానని కేటీఆర్ తరపు ణ్యాయవాదులు హెచ్చరించారు.
బండి సంజయ్కు కేటీఆర్ లీగల్ నోటీస్!
— The Bharat (@TheBharat_News) August 12, 2025
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు లీగల్ నోటీసులు పంపారు.
ఫోన్ ట్యాపింగ్లో తన ప్రమేయం ఉందని ఆధారాలు లేకుండా బండి సంజయ్ ఆరోపించారని కేటీఆర్ మండిపడ్డారు.… pic.twitter.com/o6fVR5eHX6